(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
రాష్ట్రంలో రేపటి నుండి బార్ అండ్ రెస్టారెంట్ లు ఓపెన్ కానున్నాయి. కరోనా లాక్ డౌన్ ప్రారంభం నుండి రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ లను మూసివేసిన విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం షాపుల తెరిచేందుకు అనుమతి ఇచ్చినా ఇప్పటి వరకూ బార్ అండ్ రెస్టారెంట్ లను మాత్రం తెరుచుకునేందుకు అనుమతులు ఇవ్వలేదు. అయితే కొద్ది మేర లైసెన్సు రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచడంతో పాటు కరోనా సెస్, ఏఈఆర్టీ చార్జీలను విధిస్తూ ఏక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 19వ తేదీ నుండి బార్ అండ్ రెస్టారెంట్ లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 840 బార్ల లైసెన్సులను కొనసాగిస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. 2021 జూన్ 30 వ తేదీ వరకూ బార్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. లైసెన్సు రిజిస్ట్రేషన్ చార్జీలను 10శాతం పెంచడంతో పాటు బార్ లైసెన్సుపై 20 శాతం కోవిడ్ ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. విదేశీ మద్యం, దేశంలో తయారైన విదేశీ మద్యం బీర్లు, రెడీ టు డ్రింక్ మద్యంపైనా పది శాతం మేర ఏఈఆర్టీ విధిస్తూ ఏక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?