భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన బార్క్ వివిధ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది..! మైసూరులోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) లో స్టైపెండరి ట్రైయినీ కేటగిరి-1, కేటగిరి-2, టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్, వర్క్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం ఖాళీలు : 60
విభాగాల వారీగా ఖాళీలు :
1. స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరి-1 : 11 పోస్టులు
కేటగిరి-1 లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, కెమిస్ట్రీ, కెమికల్ ,మెకానికల్ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో ఇంజనీరింగ్ డిప్లమా, బీఎస్సీ కెమిస్ట్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు 18- 24 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
2. స్టైపెండరీ ట్రెయినీలు కేటగిరి-2 : 36 పోస్టులు
కేటగిరి-2 లో ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఎలక్ట్రికల్ కార్పెంటర్, డ్రాఫ్ట్స్ మెన్, కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ ట్రేడుల్లో ఖాళీలు ఉన్నాయి. కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్ , ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, మిగతా పోస్టులకు సంబంధిత ట్రేడుల్లో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ పోస్టులకు 18- 22 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
3. వర్క్ అసిస్టెంట్ : 12 పోస్టులు
ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. వీటికి వయసు 18- 27 ఏళ్ళ మధ్య ఉండాలి.
4. టెక్నీషియన్ బాయిలర్ అటెండెంట్ : 1 పోస్టు
ఈ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణత తో పాటు బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ ఉండాలి. ఈ అటెండెంట్ పోస్టుకు వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
వేతనం : నెలకు రూ. 15,500 – 55,500/-
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు ఫీజు : ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు.
దరఖాస్తులకు ప్రారంభ తేదీ : 4/1/2020.
దరఖాస్తులకు చివరి తేదీ : 22/1/2020.
వెబ్ సైట్ : http://recruit.barc.gov.in