2014 ఎన్నికలలో చంద్రబాబు గెలిచిన తరువాత హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడైతే చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలలో స్టీఫెన్ రవీంద్ర కి డబ్బులు ఇస్తూ ఓటుకు నోటు కేసులో ఆడియో వీడియో టెపు లలో దొరకడం జరిగిందో, కేసిఆర్ టార్గెట్ చేయటం స్టార్ట్ అయిందో వెంటనే హైదరాబాద్ నుండి చంద్రబాబు దుకాణం సర్దుకుని ఏపీకి వచ్చేసారు అని చాలామంది అంటారు. అప్పట్లో ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు కి అసలు నిద్ర పట్టలేదు అని అంతలా ఆ కేసు విషయంలో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరై పోయారని చాలామంది వ్యాఖ్యానిస్తుంటారు.ఇప్పుడు ఇదే తరహాలో పార్క్ హయత్ హోటల్ కేంద్రంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్, సుజనాచౌదరి, కామినేని శ్రీనివాస్ భేటీల వెనకాల నాలుగో వ్యక్తి చంద్రబాబేనని వాటికి సంబంధించిన ఆధారాలు తెలంగాణ మరియు ఏపీ ఇంటిలిజెన్స్ వర్గాల దగ్గర ఉన్నట్లు వైసీపీ నేతలు లోలోపల చర్చించుకుంటున్నారట. ఒకపక్క నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం న్యాయస్థానంలో ఉన్న సమయంలో ఈ విధంగా భేటీ అవటంతో లీగల్ గా… జగన్ ప్రభుత్వం ఈ విషయాన్ని డీల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దీనిలో భాగంగా అప్పట్లో ఓటుకు నోటు కేసులో ఏవిధంగా చంద్రబాబు వ్యవహరించడం జరిగింది ఆ కేసును తెరపైకి తెచ్చి… పార్క్ హయత్ హోటల్లో జరిగిన వీడియో ఆధారంగా సరైన పొలిటికల్ గేమ్ స్ట్రాటజీ జగన్ వేయబోతున్నట్లు మీడియా సర్కిల్ లో వార్తలు వస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలపై తన అవినీతి డబ్బుతో పడగొట్టాలని చంద్రబాబు ప్రయత్నించే కుయుక్తులను ఈ విధంగా వైఎస్ జగన్ ఎదుర్కోవటానికి రెడీ అవుతున్నట్లు టాక్.
previous post
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?