చన్నీళ్ళ స్నానం తో ఎన్నో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయి.. బరువుతగ్గుతారు అని అంటున్నాయి అనేక పరిశోధనలు. అదెలా అంటే,చల్లని నీటి తో స్నానం చేస్తే చల్ల బడిన శరీరం మళ్లీ వేడెక్కాలంటే ఎక్కువ క్యాలరీలు అవసరమవుతాయి. దీనితో జీవ క్రియా వేగంఎక్కువవుతుంది. దీని కారణం గా శరీరం లోని కొవ్వు కరిగి వేడి పుడుతుంది.
ప్రతి రోజూచన్నీటి స్నానం చేస్తే సంవత్సరం లో నాలుగు కిలోల బరువు తగ్గే అవకాశం ఉందట. పైగా చల్లని నీళ్లు మీద పడగానే శరీరం వణుకుతుంది. అంటే కండరాల్లో కదలికమొదలవుతుంది. ఫలితంగా ఆ కండరాలు మళ్లీ సాధారణ స్థితికి రావడానికి ఇంకొన్ని క్యాలరీలు కరగలిసి ఉంటుంది. అందుకే ఇతర దేశాల్లో బరువు తగ్గడానికి ఐస్బాత్లకి వెళుతుంటారు.
లింఫటిక్ వ్యవస్థ చన్నీటి స్నానం తో చురుగ్గా పనిచేస్తుంది. చల్లని నీరు నేరుగా లింఫ్ రక్తనాళాలను ప్రభావితం చేయడం వలన అవి చురుగ్గా తయారవుతాయి. చల్లదనానికి రక్తనాళాలు సంకోచించి మళ్లీ వ్యాకోచించే ప్రక్రియ కారణంగా శరీరం లో పేరుకున్న టాక్సిన్లూ,ఇన్ఫెక్షన్లూ, రసాయనాలూ అన్నీ బయటకు పంపబడతాయి . ఈ లింఫటిక్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే చాలామంది ఎక్కువగా జలుబు చేస్తుంటుంది.
చన్నీటి స్నానం చేయడం వల్ల ఒత్తిడి ని కలిగించె హార్మోన్ల విడుదల తగ్గుతుంది. దీనితో ఒత్తిడి, ఆందోళనలుమాయమవుతాయి . పైగా చర్మమూ, జుట్టూ ఆరోగ్యం గా మృదువుగా ఉంటాయి. చల్లనినీళ్లు స్వేదరంధ్రాల పరిమాణాన్ని చిన్నగా చేస్తాయి. దాంతో చర్మం టైట్ గా మారి, నూనె విడుదల కాకుండా ఉంటుంది. దీని కారణం గా చర్మం జిడ్డు కారకుండా నూ ఆరోగ్యంగానూ ఉంటుంది. అదే సమయంలో పొడి చర్మం వాళ్ల కీ ఇది మంచిదే.
గుండెవేగం పెరగడంతో శరీరం లోని అన్ని అవయవాలూ ఎక్కువ ఆక్సిజన్ గ్రహిస్తాయి . దాంతో మొత్తంగా ఆరోగ్యం బాగుంటుంది . అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాలిసిన విషయంఏమిటంటే చన్నీళ్ళ స్నానం అలవాటులేని వాళ్లకి అస్సలు పడకపోవచ్చు కూడా. అలాంటప్పుడు ఎవరి శరీరతత్త్వాన్ని బట్టి వాళ్లు చేయడం ఉత్తమం.