గత కొన్ని రోజులుగా వార్తల్లో ఉంటూ వస్తోన్న వార్త ఇప్పుడు నిజమైంది. ప్రస్తుతం భారత్ – చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ప్రొడక్ట్స్ వాడకంపై ప్రజలు అంత సానుకూలంగా లేరు. ఇటీవలే టిక్ టాక్ బ్యాన్ కూడా ఇందులో ఒక భాగమే.
ఇక తాజాగా ఐపీఎల్ స్పాన్సర్ షిప్ వివాదం కూడా రాజుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వివో అధికారిక స్పాన్సర్ గా కొనసాగకపోవచ్చన్న ఊహాగానాలు గత కొన్ని రోజుల నుండి ఉన్నాయి. ఇప్పుడు అధికారికంగా బీసీసీఐ వివోను అధికారిక స్పాన్సర్ గా తొలగించినట్లు ప్రకటించింది. ప్రస్తుతం కొత్త టైటిల్ స్పాన్సర్ కోసం వేట కొనసాగుతోంది. ఈ ఏడాది ఐపీఎల్ సెప్టెంబర్ 19నుండి యూఏఈలో మొదలుకానున్న విషయం తెల్సిందే.