‘లాక్ డౌన్ కంటే అన్ లాక్ సమయంలోనే ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ ధరించకపోయినా.. రెండు గజాల దూరం పాటించకపోయినా.. మీతోపాటు ఇంట్లో వాళ్లని ప్రమాదంలో పడేసిన వారవుతారు. అజాగ్రత్త వహించొద్దు. ఇతరుల పట్ల కూడా జాగ్రత్తగా ఉండండి’ అంటూ మోదీ మన్ కీ బాత్ ప్రసంగంతో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ‘2020 బాలేదని.. త్వరగా అయిపోతే బాగుండని అంటున్నారు. ఆరు నెలల క్రితం ఈ పరిస్థితిని ఎవరూ ఊహించలేదు.
తుఫానులు, మిడతల దండు, భూకంపాలు, పొరుగు దేశాల కుతంత్రాలను ఎదుర్కొంటూ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఈ విపత్తులకు 2020నే కారణమనీ.. మిగిలిన ఆరు నెలలు ఇలానే ఉంటుందని ఎందుకనుకోవాలి. కష్టాలను, సవాళ్లను ఎదుర్కోని విజయం సాధించడమే భారతదేశ చరిత్ర. గంగానదీ గలగలలు రాళ్లూ, రప్పలు అడ్డొచ్చినా సాగిపోతూంటుంది. భారత్ ఎప్పుడూ కష్టాలను విజయసోపానాలుగా మార్చుకుంది. ఈ ఏడాదే దేశం కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. 130 కోట్ల భారతీయూలపై నాకు నమ్మకముంది’ అని అన్నారు.