Beauty Tips : చూడగానే అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆశపడుతున్నారు.. దీనికోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. కానీ అనుకున్నంతగా ఫలితాలు ఉండవు.. బ్యూటీ పార్లర్ కి వెళ్లే అవసరం లేకుండా నిమిషాల్లోనే అందంగా మారేందుకు ఈ టిప్స్ ప్రయత్నించండి.. మిలమిలా మెరిసిపోయే మోము ను మీరే గమనించండి..
* ముందుగా ఏదైనా ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.. ఆ తరువాత ఒక స్పూన్ తేనెలో ఒక స్పూన్ చక్కెర, రెండు చుక్కల నిమ్మరసం కలిపి స్క్రబ్ చేయాలి.. ఆ తర్వాత ఒక స్పూను శెనగపిండి, ఒక స్పూను పాలు, రెండు స్పూన్లు రోజ్ వాటర్ కలిపి పేస్టులా చేసి ముఖానికి అప్లై చేయాలి పది నిమిషాలు తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి ఆ తరువాత అలోవెరా జెల్ తో రెండు నిమిషాలు మర్దన చేసుకుని చేసుకోవాలి.. ఇప్పుడు వచ్చిన తేడాను మీరే గమనించవచ్చు.. ఈ ఫేస్ ప్యాక్ ను శనగపిండితో నే కాకుండా బియ్యం పిండి, ముల్తానీ మట్టి, సున్నిపిండి వంటివాటితో కూడా ఈ ప్యాక్ చేసుకోవచ్చు.. పాలకు బదులు మీకు నచ్చిన పండు రసాన్ని కలిపితే అదనపు అందం మీ సొంతం..
* పెరుగులో ఒక చెంచా గంధం పొడి కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ప్యాక్ లా వేయాలి. ఆరిన తరువాత నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వలన ముఖం మీద మచ్చలు మొటిమలు తగ్గుతాయి ఈ ప్యాక్ ను రెగ్యులర్ గా రాయడం వలన మరింత అందంగా మెరిసిపోతారు..
*రెండు చెంచాల శెనగపిండి కి తగినన్ని పాలు లేదా పెరుగు కలిపి క్రీమ్ లా తయారు చేసుకుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
*శెనగపిండి లో కొద్దిగా పాలు, కొంచెం తేనె, చిటికెడు పసుపు కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. ఈ ప్యాక్ ను రెగ్యులర్ గా ఫేస్ కి అప్లై చేయడం వల్ల చర్మంలో మాయిశ్చరైజర్ లెవెల్స్ తగ్గిపోకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇది క్లెన్సింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది.
*2 టీ స్పూన్ పాలలో చిటికెడు ఉప్పు వేసి అందులో ఒక కాటన్ బాల్ వేసి కాసేపు అయ్యాక కాటన్ బాల్ తో ముఖం మీద స్క్రబ్ చేసుకోవాలి. దీని మీద ఫేస్ మీద ఉన్న మురికి మొత్తం పోయి మిలమిలా మెరిసిపోతోంది దీనిని రెగ్యులర్ గా చేస్తే బెస్ట్ రిజల్ట్స్ మీ సొంతం.
*ఒక టేబుల్ స్పూన్ పాలల్లో కొంచెం తేనె కలిపి ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఈ ప్యాక్ అన్ని శరీర తత్వాల వారికి ఉత్తమ ఫలితాలు ఇస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?