ఇటీవల సామాన్య జనంలో మాస్కు ధరించి చాలా బాధ్యతాయుతంగా కరోనా వ్యాప్తి చెందకుండా వ్యవహరిస్తున్న రాజకీయ నాయకులు తప్పులు చేస్తున్నారని చాలామంది విమర్శలు చేయడం జరిగింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇంకా కొంతమంది రాజకీయ నాయకులు ఏపీ ప్రభుత్వ అధికారులపై మంత్రులపై అలాగే సీఎం జగన్ పై విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఇటీవల జాతినుద్దేశించి ప్రధాన మోడీ తన ప్రసంగంలో మాస్కు ధరించకపోతే కచ్చితంగా ఫైన్ వేస్తామని తెలపడం జరిగింది.
అంతేకాకుండా ఓ దేశ ప్రధాని మాస్కు ధరించ నందుకు ఇటీవల జరిమానా కట్టినట్లు కూడా తన ప్రసంగంలో చెప్పుకొచ్చారు. కాబట్టి సర్పంచ్ మొదలుకొని ప్రధాని వరకు ప్రతి ఒక్కరు మాస్కు ధరించి సమాజంలో బాధ్యతాయుతంగా ఉండాలని లేకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుందని తెలిపారు. ఇలాంటి తరుణంలో మొదటి నుండి మాస్కులు ఎక్కడ ధరించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అంటూ మొదటి నుండి విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మొట్టమొదటిసారి 108,104 అంబులెన్స్ వాహనాల ఓపెనింగ్ కార్యక్రమంలో మాస్కు ధరించి కనపడ్డారు. దీంతో ఎవ్వరూ చెప్పినా వినని జగన్ మోడీ చెప్పగానే విన్నాడు కారణం ఏమిటో అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరోపక్క వైసీపీ పార్టీలో తమ ముఖ్యమంత్రి మాస్కు ధరించి బయటకు రావటంతో మొన్నటివరకూ విమర్శలు వచ్చిన ఇప్పుడు ఆ చాన్స్ లేకపోవటంతో పార్టీ నేతలంతా ఫుల్ హ్యాపీగా ఉన్నారు.