టాలీవుడ్ లో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు పూజా హెగ్డే, రష్మిక మందన్న, కీర్తి సురేష్. నిన్నా మొన్నటి వరకు అందరూ పూజా హెగ్డే దే టాలీవుడ్ లో నంబర్ వన్ ప్లేస్ అని చెప్పుకున్నారు. కాని ఇప్పుడు ఆ ప్లేస్ పూజా మరో హీరోయిన్ కి ఇచ్చేసిందని అంటున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే టాలీవుడ్ లో ప్రభాస్, అఖిల్ సినిమాలు చేస్తుంది. అయితే ఇప్పుడు పూజా ని రష్మిక దాటేసిందని అంటున్నారు.
కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తెలుగు సినిమాలతో టాలీవుడ్ లో మంచి ఫాంలో ఉంది. ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్న విజయ్ దేవరకొండ నటించిన గీతా గోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక ఈ ఇయర్ ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు, నితిన్ తో భీష్మ సినిమాలు చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ఈ సినిమాల తర్వాత తెలుగులో స్టార్ హీరో సినిమా అంటే ముందు రష్మిక నే పరిశీలిస్తున్నారు మేకర్స్.
ఈ క్రమంలోనే సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న పుష్పలో ఛాన్స్ దక్కించుకుంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ 30 లో అవకాశం అందుకుందని తెలుస్తుంది. ఈ సినిమాకి త్రివిక్రం దర్శకత్వం వహించబోతున్నాడు. అలాగే యంగ్ హీరో శర్వానంద్ తో రష్మిక మందన్న నటించబోతుందని సమాచారం. కిశోర్ తిరుమల – శర్వానంద్ కాంబినేషన్ లో తెరకెక్కబోయో ఆడాళ్లూ మీకు జోహార్లు సినిమాలో రష్మిక పేరు పరిశీలిస్తున్నట్టు తాజా సమాచారం.
అయితే ఇలా వరసగా టాలీవుడ్ లో రష్మిక కి ఛాన్సెస్ రావడానికి కారణం పూజా హెగ్డే బాలీవుడ్ లో వరసగా సినిమాలు కమిటవడమే అని తెలుస్తుంది. టాలీవుడ్ కంటే బాలీవుడ్ లో పూజా హెగ్డే ఇప్పుడు ఎక్కువ సినిమాలు చేస్తుంది. ఆ రకంగా పూజా అవకాశాలన్ని రష్మిక కి వచ్చినట్టు చెప్పుకుంటున్నారు.