సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన “పుష్ప” సాధించిన విజయం రికార్డులు అన్నీ ఇన్ని కావు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఊహించని రీతిలో ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకుంది. అసలు సినిమా నిర్మాతలు కూడా అంచనా వేయలేని రీతిలో “పుష్ప” దేశంలోనే కాదు ప్రపంచంలో మారుమొగింది. ఈ సినిమాలో పాటలు అల్లు అర్జున్ మేనరిజం సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీలను ఎంతగానో ఆకట్టుకోవడం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క ప్రమోషన్ కార్యక్రమం సరిగ్గా చేయకపోయినా గాని అక్కడ ₹100 కోట్లకు పైగా కలెక్షన్ అది కూడా కరోనా సమయములో సాధించటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో “పుష్ప” మేనియా కొనసాగుతోంది. దేశంలో పలు రాజకీయ పార్టీల నాయకులను కూడా పుష్ప డైలాగులు మీడియా ముందు పలికిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాతో డైరెక్టర్ కి ఇంకా హీరో హీరోయిన్లకు మంచి క్రేజ్ లభించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా చేయడం తెలిసిందే. ఆమె నటన… పాటలకు వేసిన స్టెప్పులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. “పుష్ప” తో రష్మిక మందన పేరు కూడా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమొగింది. “పుష్ప” విజయం సాధించిన తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ ఉంది.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా “పుష్ప” క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో రష్మిక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాతో దేశము అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపురావడంతో రెమ్యూనరేషన్ ఒక్కసారిగా పనిచేయడం జరిగిందంట. “పుష్ప” రాకముందు ఒక కోటి తీసుకున్న రష్మిక ఇప్పుడు నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది. “పుష్ప” క్రేజ్ కారణంగా నిర్మాతలు కూడా రష్మిక మందన డిమాండ్ కి తలోగుతున్నట్లు టాక్.