మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ఎక్కువగా పరభాషా చిత్రాలలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ రీమేక్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. 2021 మార్చ్ నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళేందుకు ప్రణాళిక సిద్దమవుతోంది. అలాగే తమిళ సూపర్ హిట్ వేదాళం రీమేక్ లో కూడా మెగాస్టార్ నటించబోతున్నారు.
ఈ సినిమాని మెహర్ రమేష్ డైరెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమాని మహర్ రమేష్ చేతిలో పెట్టిద్దంటూ ఫ్యాన్స్ కొంతమంది అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన ట్రాక్ రికార్డ్ ని దృష్ఠిలో పెట్టుకొనే అలా అనుకుంటున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. అయినా మెగాస్టార్ మాత్రం మెహర్ రమేష్ కే ఓటేశారు. ఈ ప్రాజెక్ట్ ని తనైతేనే కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తాడన్న నమ్మకంతో ఉన్నారు.
అందుకు కారణం ఈ స్క్రిప్ట్ లో తెలుగు నేటివిటీకి, మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్టు మేహర్ రమేష్ చేసిన మార్పులు సూపర్బ్ అని అవి మెగాస్టార్ కి బాగా నచ్చాయని ఖచ్చితంగా తెలుగులో ఈ సినిమా కొత్త రికార్డ్ లు క్రియోట్ చేయడం ఖాయమని చెప్పుకుంటున్నారట. ముఖ్యంగా ఈ సినిమాకి మెహర్ రమేష్ కోల్కత్తా బ్యాక్డ్రాప్ ని యాడ్ చేయడంతో కథ లో బాగా డెప్త్ వచ్చిందని తెలుస్తుంది. గతంలో మెగాస్టార్ నటించిన చూడాలని ఉంది సినిమా కూడా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
2021 లో ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. ప్రస్తుతం మెహర్ ఈ సినిమాకి లొకేషన్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నట్టు తాజా సమాచారం. ఇక ఈ సినిమాని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఎస్ రామారావు, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ కలిసి నిర్మించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమాని దర్శకత్వం వహిస్తున్నారు.