నేచురల్ స్టార్ నాని నటించిన నిన్నుకోరి సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ గా మళ్ళీ సినిమా అన్నది నాని అకౌంట్ లో పడలేదనే చెప్పాలి. ఎన్నో అంచనాలు పెట్టుకొని గ్యాంగ్ లీడర్, జెర్సీ, వి సినిమాలు చేశాడు నాని. ఈ సినిమాల మీద ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాని కమర్షియల్ హిట్ గా ఒక్క సినిమా నిలవలేకపోయుంది. చెప్పాలంటే నాని కి సాలీడ్ హిట్ పడి చాలాకాలం అవుతోంది.
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీ రావు హైదరీ నటించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాడు. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. అంతేకాదు ఆ ప్రభావం ఇప్పుడు నాని నటించబోతున్న సినిమాల మీద పడిందని చర్చించుకుంటున్నారట.
వి రిలీజ్ తర్వాత నాని వరసగా నాలుగు ప్రాజెక్ట్స్ కమిటయ్యాడు. నిన్నుకోరి లాంటి సూపర్ హిట్ ఇచ్చిన శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న టక్ జగదీష్ ఇప్పటికే 60 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకొంది. ఇటీవలే తిరిగి షూటింగ్ మొదలైన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత మొదలవ్వాల్సిన ‘శ్యామ్ సింగ రాయ్’ కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నట్టు ముందు ప్రకటన వచ్చిన సందరికీ తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈ బ్యానర్ లో ‘శ్యామ్ సింగ రాయ్’ నిర్మించడం లేదన్న వార్త హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్మాణ సంస్థ తప్పుకోగా వెంకట్ బోయనపల్లి ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు తీసుకున్నట్టు తెలుస్తుంది. అందుకు కారణం నాని బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ కావద్దన్న నిబంధన పెట్టాడట. కాని నిర్మాత బడ్జెట్ తగ్గించాలనుకున్నట్టు తెలుస్తుంది. ఈ కారణంగానే నిర్మాత ప్రాజెక్ట్ నుంచి తపుకున్నట్టు చెప్పుకుంటున్నారు. కాగా టాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించనున్నాడు.