అమరావతి: నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ కీలకనేత, కావలి మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు వైసీపీలో చేరారు. శనివారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి, మంత్రి అనిల్ కుమార్ కూడా అక్కడే ఉన్నారు.
కాగా బీద మస్తాన్రావు శుక్రవారం తెలుగుదేశం పార్టీతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసిన ఆయన వైసీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత టీడీపీకి కాస్త దూరంగా ఉంటున్నారు. టీడీపీలో సరైన గౌరవం ఇవ్వకపోవడంతో బీద మస్తాన్రావు ఆ పార్టీని వీడారు.