Beer Bottle Murder: తెలుగు రాష్ట్రాల్లో యువతులపై ప్రేమోన్మాదుల దాడులు.. లైంగిక దాడుల ఘటనలు చూస్తూనే ఉన్నాం.. ఎక్కడికక్కడ గగుర్పొడిచే సంఘటనలతో యువతులకు రక్షణ లేకుండా పోతుందని తల్లిదండ్రులు భయంతో వణుకుతున్నారు.. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా నాగార్జునా సాగర్ లో జరిగిన ఓ ఘటన తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడేలా చేసింది.. ఓ యువతీ తన ప్రేమని అంగీకరించలేదని యువకుడు బీరు బాటిల్ పగలకొట్టి.. ఆ ముక్కలతో ఆమెని పొడిచి, గొంతు కోశాడు.. ఈ ఘటనతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Beer Bottle Murder: మద్యం మత్తులో దారుణం..!
నాగార్జున సాగర్ కి చెందిన శంకర్ అనే యువకుడు.. అదే ప్రాంతానికి చెందిన చందన అనే యువతిని ప్రేమించానంటూ వెంట పడుతున్నాడు. ఆమె అంగీకరించడం లేదు. దీంతో దాదాపు ఏడాది కాలంగా ఆమెను వెంబడిస్తూనే ఉన్నాడు. నిన్న రాత్రి మద్యం ఫుల్ గా తాగేసి ఆమెను అక్కడి శివమ్ హోటల్ పక్కకు రమ్మనీ కోరాడు. “ఈ ఒక్కసారి రా.. మళ్ళీ నీ వెంట పడను, నిన్ను మళ్ళీ మళ్ళీ విసిగించను” అని బతిమాలాడడంతో ఆమె అక్కడకు వచ్చింది. ఆమెతో వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే మద్యం తాగుతూ తన చేతిలో ఉన్న బీరు బాటిల్ ని పగులకొట్టి ఆ ముక్కలతో ఆమె కడుపులో పొడిచాడు. అనంతరం మెడపై కోశాడు. పెద్దగా అరుపులతో రక్తస్రావమై ఆమె అక్కడే మరణించారు. దీనిపై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాఋ. శంకర్ ని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది.