2019 ఎన్నికల రిజల్ట్ దెబ్బ తర్వాత చంద్రబాబుకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు సీఎం జగన్. స్వల్ప మెజారిటీతో టీడీపీ ప్రస్తుతం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తే త్వరలో చంద్రబాబు కి ప్రతిపక్ష హోదా కూడా పోయే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు అటు మీడియా వర్గాల్లోనూ ఇటు తెలుగు రాజకీయాల్లోనూ చర్చల మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వైసీపీ లోకి జంప్ అవటంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఇదిలా ఉండగా ఒక్కసారిగా చంద్రబాబుకి కుడి భుజం లాంటి నాయకుడు అచ్చెన్నాయుడు అరెస్ట్ అవ్వడం ఇప్పుడు రాష్ట్రంలో పెను సంచలనానికి దారి తీసింది.
చంద్రబాబు ప్రభుత్వం లో ఈఎస్ఐ స్కామ్లో ప్రధానపాత్రధారులుగా మాజీమంత్రి అచ్చన్నాయుడు అని ఆరోపిస్తూ ఏపీ ఏసీబీ అరెస్టు చేసింది. ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా అచ్చన్నాయుడు అరస్ట్ అవడంతో టీడీపీ శిబిరం ఒక్క సారిగా షాక్ కు గురైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారాన్ని వైయస్ జగన్ చాలా సీక్రెట్ గా పగడ్బందీగా నడిపినట్లు ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. అప్పట్లో అచ్చెన్నాయుడు….జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అసెంబ్లీ లో భయంకరమైన విమర్శలు, చాలా పరుషపదజాలం తో చేస్తూ రకరకాల ఆరోపణలు చేసేవారు. చంద్రబాబు హయాంలో ప్రతిసారి అచ్చెన్నాయుడు జగన్ ని టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఆ తర్వాత 2019 ఎన్నికలలో టీడీపీ అధికారం కోల్పోవడం జగన్ ముఖ్యమంత్రి అవడం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో కూడా కొద్దిగా స్పీడ్ తగ్గించిన గాని వైయస్ జగన్ నే టార్గెట్ చేస్తూ అచ్చెన్నాయుడు అసెంబ్లీలో వ్యవహరించడం జరిగింది. కాగా అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ అచ్చెన్నాయుడు పై ఆరోపణలు ఉన్న ఈఎస్ఐ కుంభకోణం పై దృష్టి పెట్టడం జరిగింది. ఈ విషయంలో అధికారులు విచారించి మొత్తం నివేదిక పరిశీలించి గ్యారెంటీగా స్కాం జరిగిందని, అచ్చెన్నాయుడు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఏసీబీ గుర్తించింది. దాదాపు 150 కోట్ల స్కాం జరిగిందని ఏసీబీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో అరెస్ట్ అవుతారు అని అప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించారు. ఈ విషయం అచ్చెన్నాయుడుకు సైతం తెలిసిందే. ఈ కేసు మొత్తం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ పర్యవేక్షించడంతో వారు నేరుగా సీఎంకే ప్రతి డెవలప్మెంట్ నివేదిస్తూ వచ్చారు. చివరకు అచ్చెన్న అరెస్టు విషయం ముఖ్యమంత్రి జగన్, ఏసీబీ చీఫ్ సీతారామాంజనేయులుకు తప్ప మంత్రులకు సైతం సమాచారం లేదు. అంచనా కూడా వేయలేకపోయారు.
ఎక్కడా కూడా మీడియా కి గాని విషయం లీక్ అవ్వకుండా అచ్చెన్నాయుడు అరెస్ట్ ముందు వైయస్ జగన్ కేసును టేకప్ చేసిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఏసీబీ అధికారులతో సీక్రెట్ మీటింగ్ జరిపించి మొత్తం క్షుణ్ణంగా పరిశీలించి అప్పుడు పోలీసులకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అచ్చెన్నాయుడు అరెస్టు అయినట్లు ప్రభుత్వ వర్గాలలో టాక్. మొత్తంమీద చూసుకుంటే అచ్చం నాయుడు అరెస్టు విషయంలో అటు అధికార పార్టీ నేతలకు ఇటు ప్రతిపక్ష నేతలకు కూడా విషయం తెలియకుండా జగన్ చాలా సక్సెస్ ఫుల్ గా ఈ విషయం నడపడంతో ప్రస్తుతం… అచ్చెన్నాయుడు అరెస్ట్ వ్యవహారంలో టీడీపీ ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు టాక్.