NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత రాక నేపథ్యంలో ఈ కీలక పరిణామాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సిద్దమైయ్యారు. మరి కొద్ది సేపటిలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి న్యాయవాదితో సహా కవిత హజరుకానున్నారు. కవితను అరుణ్ రామచంద్ర పిళ్లై, మనీశ్ సిసోడియాలతో కలిపి ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇంతకు ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించడంతో కవితను అరెస్టు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకు ముందు సీబీఐ అధికారులు కవిత ఇంటికి వెళ్లి విచారణ జరపగా, ఈడీ అధికారులు మాత్రం ఢిల్లీలోని కార్యాలయానికి విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. తొలుత 9వ తేదీ విచారణ కు రావాలని నోటీసులు జారీ చేయగా, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాల వల్ల హజరు కాలేననీ, 15వ తేదీ తర్వాత విచారణకు వస్తానని కవిత ఈడీకి తెలియజేయగా వారు అంత సమయం ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో 11వ తేదీ విచారణకు హజరు అవుతానని చెప్పడంతో అందుకు ఈడీ అంగీకరించింది.

MLC Kavitha

 

అయితే హైదరాబాద్ కు చెందిన ప్రముఖ లిక్కర్ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై వ్యాంగ్మూలం ఆధారంగా కవితను విచారించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కవిత ను ఈడీ నోటీసులు జారీ తర్వాత మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాను కవితకు బినామీ అంటూ ఈడీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు రామచంద్ర పిళ్లై తెలిపారు. ఇందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  ఈ పిటిషన్ పై ఈ నెల 13న విచారణ జరగనున్నది. ప్రస్తుతం అరుణ్ పిళ్లై ఈడీ కస్టడీలో ఉన్నారు.

కవిత విచారణ నేపథ్యంలో మరో పక్క తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒక వేళ కవితను అరెస్టు చేస్తే తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళన చేసేందుకు బీఆర్ఎస్ నేతలు సన్నద్దం అవుతున్నారు. కవితకు బాసటగా నిలిచేందుకు మంత్రులు కేటిఆర్, హరీష్ రావు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఈడీ కార్యాలయం వద్ద కేంద్ర బలగాలతో భద్రతను పెంచడమే కాక ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ను విధించారు. పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే అరుణ్ రామచంద్ర పిళ్లై తను ఇచ్చిన వాంగ్మూలాన్ని వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో పాటు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇవేళ విచారణ అనంతరం కవితపై బలవంతపు చర్యలు ఏమీ ఉండవచ్చని భావిస్తున్నారు. అరుణ్ పిళ్లై వాంగ్మూలంపై కోర్టు నిర్ణయం తర్వాతనే ఈడీ ఈ కేసులో నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?