బాహుబలి సినిమా తో దేశవ్యాప్తంగా మాత్రమే కాక ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు రాజమౌళి. ఈ క్రమంలో జాతీయ మీడియా అదేవిధంగా పలు రాష్ట్రాల లోకల్ మీడియా లో చేసిన చాలా ఇంటర్వ్యూలలో మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి అని ప్రశ్నించగా “మహాభారతం” అని రాజమౌళి తెలపడం జరిగింది.
ఇదిలా ఉంటే రాజమౌళి కంటే ముందే ఈ ప్రాజెక్టుని తెరకెక్కించడానికి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇప్పుడు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక మహాభారతం మాత్రమే కాక రామాయణం కూడా తెరకెక్కించే ఆలోచన త్రివిక్రమ్ చేస్తున్నట్లు మీడియా సర్కిల్స్ లో టాక్ వినబడుతోంది.
గత ఏడాది సంక్రాంతి పండుగకు టాలీవుడ్ ఇండస్ట్రీకి మర్చిపోలేని హిట్ “అలా వైకుంఠపురంలో “ సినిమాతో అందించాడు త్రివిక్రమ్. ఆ తర్వాత కరోనా రావటంతో కొన్ని నెలలపాటు ఖాళీ టైం దొరకడం తో మహాభారతం, రామాయణం సినిమాల స్క్రిప్ట్ దృష్టి పెట్టినట్లు..త్వరలోనే అతి తక్కువ టైమ్ లోనే.. ఈ రెండు సంచలన ప్రాజెక్టులు తెరకెక్కించే రీతిలో త్రివిక్రమ్ ఆలోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాని డైరెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా తర్వాత ఆ రెండు సంచలన ప్రాజెక్టులు ఉండే అవకాశం ఉందని సో రాజమౌళి కంటే ముందే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహాభారతం సినిమా చూసే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. చాలావరకు త్రివిక్రమ్ అలనాటి పురాణాలకు సంబంధించి మహాభారతం అదేవిధంగా రామాయణం వంటి గ్రంధాలలో ఉన్న సంభాషణలను తన సినిమాలో పొందుపరుస్తూ .. తీసే సన్నివేశాలకు మరింత ఊతం ఇచ్చేలా డైరెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఏకంగా సినిమాలు తీయటానికి త్రివిక్రమ్ ఐడి అవుతున్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీ వర్గాల లో మాత్రమేకాక సోషల్ మీడియాలో కూడా ఈ వార్త ఇప్పుడు సంచలనంగా మారింది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!