పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాలపాటు రాజకీయ రంగంలో ఉండటంతో సినిమాలు చేయలేకపోయారు. 2018 వ సంవత్సరం లో అజ్ఞాతవాసి సినిమా తర్వాత మరో సినిమా చేయకుండా ఏకధాటిగా రెండు సంవత్సరాలు జనసేన పార్టీని ముందుండి నడిపించడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో ఇక సినిమాలు చేయడం లేదని పవన్ కళ్యాణ్ బహిరంగంగానే మీడియా ముందు తెలపడం జరిగింది.
కానీ ఎన్నికల్లో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్ నిలబడిన రెండు చోట్ల ఓడిపోవడం జరిగింది. అయితే ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేయాలని అభిమానుల పరంగా అదేవిధంగా ఇండస్ట్రీ పరంగా ఒత్తిడి రావటంతో పాటు మరోపక్క పార్టీని ఆర్థికంగా ముందుకు నడిపించడానికి వేరొక మార్గము లేకపోవటంతో పవన్ ఈ ఏడాది ప్రారంభంలో సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ “వకీల్ సాబ్” గా అభిమానులను అలరించటానికి రెడీ అవుతున్నారు. బాలీవుడ్ పింకు సినిమాకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా.. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఏడాదిలో మోస్ట్ ట్వీటెడ్ సినిమాగా వకీల్సాబ్ చరిత్ర సృష్టించినట్లు ట్విట్టర్ ఇండియా ప్రకటించింది. ముఖ్యంగా లాక్ డౌన్ సమయం లో వకీల్సాబ్ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియా అంతా షేక్ అయిపోయింది. 24 గంటల్లో ట్విట్టర్ లో హైయెస్ట్ రీ ట్వీట్స్ సాధించిన సినిమాగా చరిత్రను తిరగ రాసింది.