రాష్ట్రంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదులుగా ఉన్న, పెనుమాక వెంకట్రావు, గడ్డం సతీష్బాబు, షేక్ హబీబ్ అనే ముగ్గురు న్యాయవాదులు రాజీనామా చెయ్యటం, వెంటనే దాన్ని ప్రభుత్వం ఆమోదించటం జరిగిపోయాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, హైకోర్టులో, అటు సుప్రీం కోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులు రాజీనామా చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.వీరి రాజీనామాలను వెంటనే ఆమోదించిన ప్రభుత్వం, త్వరలోనే వీరి స్థానంలో కొత్త వారిని భర్తీ చేయ్యనుంది. అంటే ప్రభుత్వమే వీరి చేత రాజీనామా చేయించిందా అన్న అనుమానం కూడా కలుగుతోంది.అలాగే వీరి రాజీనామా విషయం పై ఇప్పుడు పలు ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రభుత్వ విధానాలను మేము మోయ్యలెం అని వీరు రాజీనామా చేసారా ? లేక తమ వల్లే ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయనే, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసారా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వం వీరితో చర్చించి రాజీనామా చేపించిందా ? లేక వీరంత వీరే రాజీనామా చేసారా అనేది తేలాల్సి ఉంది .. ఈ పరిణామంతో ఒక్కసారిగా ప్రభుత్వ వర్గాల్లో కలకలం రేగింది..ప్రభుత్వం తమ నిర్ణయాలు రాజ్యంగబద్ధంగా, చట్ట ప్రకారం ఉంటె, కోర్టులు కూడా సహకరిస్తాయని, అలా కాకుండా రంగులు వెయ్యటం, రాజ్యాంగం ప్రకారం మాతృభాషలో చదువు, రాజ్యంగం ప్రకారం నియమించిన ఎన్నికల కమీషనర్ ను తప్పించటం లాంటి పనులు చేస్తే, ఏ న్యాయవాది అయినా ఏమి చెయ్యలేరని, న్యాయవాదులను మార్చటం కాదని, ప్రభుత్వం తమ వైఖరిని సరిసుకోవాలనే వాదన వినిపిస్తుంది.ముందు ఇంటిని సరిదిద్దు కొమ్మని జగన్ ప్రభుత్వానికి సలహాలు కూడా వస్తున్నాయి.