Curd: వేసవి మొదలైంది. భానుడు భగభగమంటూ నిప్పులు కక్కుతున్నాడు. ఎండకాలంలో వేడిమి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ఎండకాలంలో కూడా ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. వేసవిలో ఎక్కువ మంది పెరుగు, మజ్జిగ తీసుకోవడానికి ముందుకొస్తారు.
Curd Rice: ఆ దేవతకు పెరుగన్నం నైవేద్యంగా పెట్టడం వలన ధనాభివృద్ది కలుగుతుంది!!
శరీరంల తేమ శాతం తగ్గిపోకుండా ఉండేందుకు ఎక్కువగా పెరుగు, మజ్జిగ తీసుకుంటూ ఉంటారు. పెరుగును కూడా ఇమ్యూనిటీని పెంచుతుందని వైద్యులు చెబుతుంటారు. అంతే కాకుండా పెరుగుతో ఎముకలు కూడా బలంగా తయారవుతాయి. జీర్ణశక్తిని మెరుగుపరచడమే కాదు.. ఎక్కువ తినడం వల్ల బరువు కూడా కంట్రోల్ అవుతోంది. మరి ఇష్టమొచ్చిన రీతిలో పెరుగు తింటే ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. పెరుగుతో మేలు మాత్రమే కాదు. పెరుగును వేడి చేయడం వల్ల అందులో ఉన్న సుగాణాలన్నీ పోతాయి. అందుకోసమే పెరుగును వేడి చేయకూడదన్నారు.
Curd: పెరుగులో బెల్లం కలుపుకుని తింటే ఏమి జరుగుతుందో తెలుసా ??
ముఖ్యంగా రాత్రి పూట పెరుగు అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. చాలామంది ఆరటి, దానిమ్మ, మామిడి పండు తీసుకొని తింటారు. అలా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదన్నారు. బరువు ఎక్కువగా ఉన్నవారు, ఇంప్లమేటరీ కండిషన్స్ ఉన్నవారు, బ్లీడింగ్ డిసార్డర్స్ ఉన్నవారు చికెన్, చేపలతో కలిసి పెరుగు తినకూడదన్నారు. పెరుగును మధ్యాహ్నం పూట మాత్రమే తింటే మంచిదన్నారు. పెరుగు తీనే వారు కచ్చితంగా ఈ జాగ్రత్తలను పాటించాలన్నారు. మాంసాహారం తీసుకొనేటప్పుడు పెరుగు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలత్తే అవకాశం ఉందన్నారు. ఏఏ సమయాల్లో మనం పెరుగు తీసుకోవాలని తెలుసుకుంటే మంచిదని నిపుణుల అభిప్రాయం.