ఈ రోజుల్లో అధిక బరువు అనేది సర్వసాధారణం గా ఉంది.. చిన్న పిల్లల దగ్గరనుండి పెద్దవారివరకు ఈ సమస్య తో బాధపడుతున్నారు. తమ శరీర బరువును అదుపుచేసుకునేందుకు రకరకాల ప్రయోగాలు మొదలు పెడుతుంటారు.అయితే ద్రాక్ష పండ్ల రసం తాగితే మాత్రం ,బరువు తగ్గి నాజూకుగా తయ్యారవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పండ్ల రసం తాగాలనిపించినప్పుడల్లా, ఒక గ్లాస్ ద్రాక్షరసం తాగటం వలన మంచి ఫలితం పొందవచ్చు. ద్రాక్ష రసం లో మిగిలిన పండ్లకన్నా తక్కు వ క్యాలరీలు ఉంటాయి. ద్రాక్ష రసం లో పంచదార వేసుకోకుండా తాగటం ఇంకా మంచిది. ద్రాక్షలో ఉన్న పీచుపదార్థం ఈ రసాన్ని ఎక్కువ సమయం కడుపులో నిలిచి ఉండేలా చేస్తుంది. దీంతో ఆకలి తగ్గిపోయి ఆహారం ఎక్కువగా తీసుకోలేరు .
ద్రాక్ష లో ఉండే పీచుపదార్థం శరీరం లో కొవ్వు చేరకుండా చూస్తుంది. ద్రాక్షరసంలో పంచదార వేసుకో కుండా తాగితే తక్కువ క్యాలరీలు శరీరం లోకి చేరతాయి. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్టరాల్ని శరీరంలో కి చేరకుండా అడ్డుకుంటుంది. దీం తో శరీరం నాజూకుగా తయారవుతుందంటున్నారు నిపుణులు.
తలనొప్పి వచ్చిందంటే ఇక అసలు ఏమి తోచదు.. గందరగోళంగా ఉంటుంది. ఏవేవో కారణాలతో తలనొప్పి వస్తూనే ఉంటుంది. తలనొప్పి వచ్చిన వెంటనే మందులు వాడకుండా కొన్ని చిట్కాలు పాటిస్తే నొప్పి ఇట్టే తగ్గిపోతుంది. తలనొప్పిగా ఉన్న సమయంలో ద్రాక్షరసం తీసుకుంటే, నొప్పి వెంటనే తగ్గిపోతుంది. ఇందులోని ప్రత్యేక మినరల్స్, విటమిన్స్ శరీరాన్ని రిలాక్స్ చేస్తాయి. దీం తో తలనొప్పి త్వరగా తగ్గుతుంది.
ఒకవేళ ద్రాక్ష అందుబాటులో లేకపోతే కాస్త వెచ్చగా టీ ,కాఫీ, లు తాగ వచ్చు. వీటి వల్ల కూడా ఉపశమనం ఉంటుంది. చాలా సార్లు నీరు సరిపడా తాగక పోయిన నిద్రలేక పోయిన తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి ఈ సమస్యలు గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఇలాంటివన్నీ పాటించాక కూడా తలనొప్పి తగ్గినట్టు అనిపించక పొతే డాక్టర్ ని సంప్రదించడి.