బెల్లం లో ఉండే ఔషధ గుణాలు జీర్ణాశయం లోనిజీర్ణరసాలను ఉత్సహపరుస్తాయి. గ్యాస్, మలబద్దకం, ఏసీడీటీ లాంటి సమస్యలు కూడా ఉండవు. పొట్ట లో చల్లగా ఉండాలంటే బెల్లం షర్బత్ తాగాలని డాక్టర్లు సూచిస్తున్నారు. శ్వాస కోస సంబంధ సమస్యల్ని కూడా బెల్లం తగ్గిస్తుంది. బెల్లం, నువ్వులు కలిపి తింటే ఆస్తమా తో బాధ పడేవారికి చక్కటి ఫలితం కనిపిస్తుంది మంచి ప్రయోజనం కలుగుతుంది.
బెల్లం పొటాషియం ఎక్కువగా కలిగి ఉండడం వలన దీన్ని తింటే శరీరం లో ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంలో ఉండడం జరుగుతుంది. శరీర మెటబాలిజం క్రమపద్ధతి లో ఉంటుంది. ఒంట్లోఉండే అధిక నీరు బయటకు పోతుంది. బరువు తగ్గుతారు. గుండె జబ్బులువచ్చే అవకాశాలు బాగా తక్కువగా ఉంటాయి. బెల్లంలో సోడియం ,పొటాషియం, శరీరంలో యాసిడ్ స్థాయిలను క్రమపద్ధతి లో ఉంచడంలో ముందుంటాయి. వీటి ద్వారా బీపీ అదుపు లో ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారికి బెల్లంమంచి మార్గం. ఇందు లోని పొటాషియం మన శరీరం లోని ఎలక్ట్రోలైట్స్ని సమం గా ఉండేలా చేస్తుంది.. కండరాల్ని ధృడంగాచేసి, మెటబాలిజంను పెరిగేలా చేస్తుంది. తద్వారా శరీర బరువును అదుపుచేస్తుంది. బాగా బరువు తగ్గాలనుకునేవాళ్లు, తమ ఆహారం లో బెల్లాన్ని కూడా చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
బెల్లం మన కాలేయానికి ఎంతగానో మేలు చేస్తుంది. కాలేయాన్ని శుభ్రం గా ఉండేలా చేస్తుంది. రోజూ బెల్లం తింటే కాలేయం లో ఉండే హానికర విష పదార్థాలు , వ్యర్థాలు,బయటకు పోయి శుభ్రంగా ఉంటుంది. కాలేయ నికి సంబందించిన అనారోగ్యాలు రాకుండా ఉంటాయి.బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడం లో అద్భుతంగా పని చేస్తుంది.కాబట్టి అప్పుడప్పుడు అయినా కొంచెం బెల్లం తింటూ ఉంటే రక్త శుద్ధి జరుగుతూ ఉంటుంది.శరీరం లో హిమోగ్లోబిన్ శాతాన్ని కూడా పెరిగేలా చేస్తుంది.
రక్త హీనతను తగ్గేలా చేస్తుంది. అనేక రకాల వ్యాధులు శరీరానికి రాకుండా ఉండాలంటే రక్తం పరిశుభ్రం గా ఉండాలి. బెల్లం లో జింక్, యాంటీఆక్సిడెంట్స్, సెలెనియం లాంటి ఖనిజాలుంఉండడం వలన అవి సూక్ష్మక్రిముల ద్వారా శరీరానికి జరిగే హానిని నివారిస్తాయి. ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా శరీరాన్ని రక్షిస్తాయి.బెల్లం లో అధికం గా ఉండే పోషకాలు,నెల సరి సమయంలో వచ్చే నొప్పు లను దూరం చేస్తాయి. నెలసరి తర్వాత అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజూ కొంచెం బెల్లం తింటుంటే మంచిది.
బెల్లం నుంచీ విడుదలయ్యే ఎండోర్ఫిన్స్, శరీరా నొప్పుల నుంచీ ఉపశమనాన్ని ఇస్తాయి. కీళ్ల నొప్పులు, మంటల తో బాధపడే వాళ్లు బెల్లంతీసుకోవాలి. ఇది ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. బెల్లం,అల్లం తో కలిపి తింటే ఇంకా మంచి ఉపశమనం కలుగుతుంది. బెల్లం కలుపుకుని రోజూ పాలు తాగితే, ఎముకలు పుష్టిగా ఉండడంతో పాటు కీళ్ల నొప్పుల సమస్యతగ్గుతుంది.
బెల్లం లో ఎక్కువ పరిమాణం లో ఉండే మెగ్నీషియం,పేగుల కు బలాన్నిస్తుంది.పంచదార కంటే బెల్లం ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి. నేయి తో బెల్లం వేడి చేసి నొప్పిగా ఉన్నా చోట పట్టు వేస్తే బాధ తగ్గుతుంది. పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటలు తింటే ముక్కు కారడము తో బాధపడుతున్న వారికి ఉపశమనం కలుగుతుంది. బెల్లం, నెయ్యి సమంగా కలిపి తింటే 5 -6 రోజు లలో మైగ్రిన్ తల నొప్పితగ్గిపోతుంది .