బియ్యం నీరు చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా చేస్తుంది. ఇది శరీరం లో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ కణాలను మెరుగుపరుస్తుంది. చర్మం అందం గా,యవ్వనంగా కనిపించే లా మారుస్తుంది. బియ్యం నీరు జుట్టు కు మంచిది. ఇనోసిటాల్ మరియు కార్బోహైడ్రేట్ బియ్యం నీటిలో ఉన్నాయని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.
ఇది పొడిబారిన మరియు చిట్లిన జుట్టు ని బాగుచేస్తుంది. బియ్యం నీటి తో జుట్టు ను కడిగినప్పుడు, ఇనోసిటాల్ జుట్టు లో పొరగా పని చేసి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.ఈ నీటి లో అమైనో ఆమ్లాలుఉండడం వలనజుట్టుదుళ్లను బలంగా మృదువుగా మరియు మెరిసేలా చేస్తుంది. అందువల్ల బియ్యం నీరు జుట్టు కు ప్రయోజనకరమైనది, సహజమైనది, సురక్షితమైనది మరియు దుష్ప్రభావాలు కూడా ఉండవు. బియ్యాన్ని నానబెట్టిన నీటిలో… చర్మాన్ని కాపాడే గుణాలుంటాయని పరిశోధనల్లో తేలింది.
బియ్యాన్ని 15 నిమిషాలు నానబెట్టి ఆ నీటి ని వేరు గా తీసుకోవాలి . ఆ తరవాత బియ్యాన్ని వేరే నీటి తో కడుక్కోవచ్చు.వేరు చేసిన నీటిని ఫ్రిజ్లోని ఐస్ క్యూబ్ ట్రేలలో పోయాలి. ఆ ట్రేలలో నీరు గడ్డకట్టి, ఐస్ క్యూబ్స్ గా తయారవుతాయి. వాటిని స్నానానికి వెళ్లే ముందు 10 నిమిషాల పాటు చర్మం పై రుద్దుకోవాలి. ఐస్ ట్రే లలో వేయగా మిగిలిన నీటిని, ఏదైనా స్ప్రే బాటిల్లో పోసి ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత అవసరమైనప్పుడు ముఖం పై, చేతుల పై స్ప్రే చేసుకుని మసాజ్ చేసుకుని కొంచెం సేపు అలా వదిలేయడం వలన కూడా మంచి ఫలితం పొందుతాము. బియ్యం కడిగిన నీటి తో ముఖా న్ని కడిగితే మొటిమలు , మచ్చలు, తొలగి పోతాయి . చర్మం మెరిసిపోతుంటుంది.
Disclaimer : పైన సూచించిన ఆరోగ్య సూత్రాలు, లేదా హెల్త్ కి సంబంధించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా స్పెషలిస్ట్ డాక్టర్ సలహా తీసుకోండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?