Stem cells : నేటి ఆధునిక వైద్య విధానంలో బొడ్డుతాడు అపురూప లక్షణాలున్న జీవ రహస్య నిధి గా చెప్పుకోవచ్చు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎన్నో జబ్బులకు చికిత్స చేయడానికి బొడ్డుతాడు సంజీవని గా పనిచేస్తుంది. తల్లి గర్భంలో ఉన్న పసిపాపకు బొడ్డు తాడు ద్వారానే ఆహారం అందుతుంది. ఈ ప్రక్రియ 9 నెలల వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. తల్లి గర్భం నుండి భూమి మీద పడినప్పుడు మాత్రమే తల్లీబిడ్డల పేగు బంధం తెగిపోతుంది. మంత్రసానుల నుంచి వైద్యుల వరకు బొడ్డు తాడు ఎందుకు పనికి రాని పేగు ముక్కగా భావించి కత్తిరించి పారేసేవారు.
దీని మీద అనేక పరిశోధనలు జరపగా తెలిసింది ఏమిటంటే బొడ్డు తాడు ఎందుకు పనికి రానిది కానే కాదు అది ఎన్నో రకాల జబ్బులు నయం చేయగల సంజీవని అని తేలింది. పిల్లల కు భవిష్యత్తులో ప్రమాదకర జబ్బులు నయం చేసేందుకు అవసరమైన మూలకణాలు ఈ బొడ్డు తాడు లో దాగి ఉన్నట్లు గుర్తించారు. దీంతో బొడ్డుతాడు నిల్వ చేసుకునేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు . ఇందు కోసం స్టెమ్ సెల్స్ (బొడ్డు తాడు) నిల్వ చేసుకునే కంపెనీలు ప్రత్యేక ప్యాకేజీ కూడా అందిస్తోంది.
అయితే ఈ బొడ్డు తాడు లో రెండు రకాల మూల కణాలు ఉంటాయి. అవి ఏమిటంటే 1. మిసైన్కైమల్ స్టెమ్ సెల్స్, 2. ఎపిథీలియల్ స్టెమ్ స్టెల్స్ గా ఉంటాయి. మిసైన్ కైమల్ స్టెమ్ సెల్స్ ద్వారా గుండెనరాలు,కొవ్వు మూలుగ, ఎముకలు, సంబంధిత జబ్బులను నయం చేసే మూల కణాలు ఉంటాయి. అదే విధంగా లివర్, జీర్ణవాహిక సంబంధ క్యాన్సర్ జబ్బులకు చికిత్సకు ఉపయోగించే మూల కణాలు ఉంటాయి. ఎపీథీలియల్ కణాల్లో చర్మ సంబంధిత జబ్బులు నయం చేసే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 81 రకాల జబ్బులకు ఈ మూలకణాల చికిత్స ద్వారా నయం చేయవచ్చని వైద్య నిపుణులు తెలియచేస్తున్నారు.