పాత కాలంలో చాలా మందిపొద్దు ,పొద్దున్నే సద్దన్నంలో పచ్చిమిర్చిని లేదా ఉల్లి ని నంజుకుని తినేవారు.చద్దన్నం , ఉల్లి వలన శరీరానికి చలువ చేస్తుంది. ఇక పచ్చిమిర్చిలో ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఇవి అనేక ఆరోగ్య సమస్య లను దూరం చేస్తాయి. కాబట్టి మన పెద్ద వారు ఎంతో ఆరోగ్యం గా ఉండే వారు. ఇప్పటి కాలం వచ్చే సరికి జంక్ ఫుడ్ ఎక్కువైయింది. కొంచెం కారం తగిలితే చాలు రొప్పుతూ ఉంటాము. మన శరీరానికి కారం చాల అవసరం.కాబట్టి క్రమం తప్పకుండా, పచ్చిమిర్చిని ఆహారం లో భాగం చేసుకోవడం లో నిర్లక్ష్యం చూపించవద్దు.
అధిక బరువు ఉన్న వారు మిర్చి ని తమ ఆహారం లో భాగం చేసుకోవడం వల్ల షుగర్ దరి చేరకుండా ఉంటుందట. పచ్చిమిర్చిలో ఉండే ప్రత్యేక గుణాలు ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమపద్ధతి లో ఉండే లా చేస్తాయి. అందుకే పచ్చిమిర్చిని క్రమం తప్పకుండా తీసుకోమనిసూచిస్తున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల షుగర్ వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చని చెబుతున్నారు.
పచ్చిమిర్చిని తిన్న తర్వాత శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి జరిగి రక్తం లో షుగరు స్థాయి 60 శాతం తగ్గుతాయని నిపుణులు తెలియచేస్తున్నారు. వీటిని రెగ్యులర్గా తినడం వల్ల జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. పచ్చి మిర్చి లోని ఎన్నో గుణాలు కొలెస్ట్రాల్ సమస్య ని దూరం చేస్తుందని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునేవారు క్రమం తప్పకుండా పచ్చిమిర్చిని తింటే చక్కటి ఫలితం ఉంటుందని చెబుతున్నారు.
పచ్చిమిర్చి తినడం వల్ల మరికొన్ని ఇతర లాభాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. కేప్సైసిన్ పచ్చిమిర్చిలో అధికంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరం లో ఉండే గోధుమ,తెలుపు రంగు రెండు రకాల కొవ్వులు తగ్గుతాయని తెలియచేస్తున్నారు. ఇది శరీరపు మెటాబాలిజాన్ని పెరిగేలా చేస్తుంది. మెటబాలిక్ పెరగడం వలన ఎటువంటి వ్యాయామం చేయకుండా నే బరువు తగ్గుతారు.