మన ఆరోగ్యాన్నీ కాపాడడానికి ఆయుర్వేదం లో ఎన్నో సహజ మూలికలు వున్నాయి. వాటిలో ఒకటి జాజికాయ. తాంబూలం లో జాజికాయను పొడిగా చేసుకుని వేసుకుని తింటే నోటి నుండి వచ్చే చేదు వాసన తొలగిపోతుంది. పంటిమీద ఉండే నలుపునూ, గారను పోగొట్టి.. పళ్ళు మెరిసేలా చేస్తుంది. జాజికాయ పొడిని పాలలో కలుపుని తాగితే గుండెల్లో నొప్పి, దడ తగ్గుతాయి. చాలా కొంచెం పొడిని తీసుకుని గోరువెచ్చని పాలల్లో, కలుపుకుని తాగితే చర్మ కాంతి పెరగడంతోపాటు చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. అధికదాహాన్ని నివారిస్తుంది. జలుబు, దగ్గు, కఫానికి విరుగుడుగా పనిచేస్తుంది.
నీళ్లు లేదా తేనె లో కొంచెం జాజికాయ పొడిని వేసి కలిపి పేస్ట్లాగా తయారు చేసుకుని స్క్రబ్లా ముఖానికి రాసుకోవాలి. ఇలా క్రమం తప్ప కుండ చేస్తుంటే కొన్ని రోజులకు చర్మం కాంతివంతమవడంతో పాటు చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. జాజికాయను పౌడర్ గా చేసుకుని అతి స్వల్ప పరిమాణంలో వాడుతున్నట్లయితే.. కొన్ని అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది.
‘మిరిస్టిసిన్’ అనే పదార్థం ఈ కాయలో లభించడం వలన అది మెదడు చురుగ్గా పనిచేసేందుకు పనిచేస్తుంది.జాజికాయ అల్జీమర్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేస్తుంది. శరీరం నుంచి వ్యర్థ పదార్థాలను పూర్తిగా తొలగించే శక్తి జాజికాయకు ఉంటుంది.
జాజికాయ మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను సైతం కరిగిస్తుంది. జాజికాయను వాడవలిసిందానికన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల సమస్యలు వస్తాయికాబట్టి , జాజికాయ వాడకం విషయం లో కాస్త జాగ్రత్తఅవసరం . గర్భవతులు దీన్ని వాడకుండా ఉండడం మేలు. నిత్యం జాజికాయల పొడిని తీసుకుంటే శరీరంలో ఉన్నకొవ్వు తగ్గుతుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. దీని కారణం గా గుండె జబ్బులు రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు తెలియ చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?