పశ్చిమ బెంగాల్ ఒకానొక సమయంలో వామపక్షాల కంచుకోట. అలాంటి చోట్ల మమతాబెనర్జీ గత కొంత కాలం నుండి వరుస విజయాలతో జాతీయ రాజకీయ నేతలు దిమ్మతిరిగే రాజకీయం చేస్తూ రాణిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో మమతా బెనర్జీ పార్టీ కి మరియు బిజెపి పార్టీ కి మధ్య పోటా పోటీ నువ్వానేనా అన్నట్టుగా ఉంది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒకానొక సమయంలో ఉనికి కోసం వెంపర్లాడిన బిజెపి గత పార్లమెంట్ ఎన్నికల్లో 40 శాతం ఓట్లు రాబట్టడం తో.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో అధికారం హస్తగతం చేసుకోవడానికి ఎత్తులు పై ఎత్తులతో ఎన్నికలకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో ఆపరేషన్ ఆకర్ష్ ఈ కార్యక్రమాన్ని ఏకంగా మమతా బెనర్జీ పార్టీ ప్రయోగిస్తూ ఇప్పటికే ముగ్గురు మంత్రులను అదేవిధంగా 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఎంపీలను తన పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది.
దీంతో బెంగాల్ రాజకీయం రసవత్తరంగా మారింది. తెలుగు సర్వే సంస్థ తాజాగా అక్కడ చేసిన సర్వే లో కాషాయ పార్టీ కి 36 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని, మమతా బెనర్జీ పార్టీకి 44 శాతం ఓట్లు రాబట్టడం గ్యారెంటీ అని, మళ్లీ మమత ప్రభుత్వం స్థాపిస్తుందని ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్ పార్టీల కు 13%, ఇతరులకి 6.5% వస్తాది అని అంచనా. ఇక ఎమ్మెల్యే స్థానాల పరంగా చూసుకుంటే మమతాబెనర్జీ పార్టీకి 159 నుంచి 167, బీజేపీ కి 90 నుండి 98, కాంగ్రెస్ ప్లస్ లెఫ్ట్ పార్టీ 23 నుండి 27, ఇతరులకి 2 నుంచి 5 స్థానాలు వస్తాయని ఈ తెలుగు ప్రీ పోల్ సర్వే సంస్థ ప్రాథమిక అంచనాల ఫలితాలు వచ్చాయి. సో మొత్తం బట్టి చూస్తే మళ్లీ మమతా బెనర్జీ సర్కార్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది.