Feeding Mother: ప్రసవించిన తరువాత తల్లి తీసుకునే ఆహారం తోనే బిడ్డ ఆరోగ్యం ముడిపడి ఉంటుంది.. డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ ఆరోగ్య సమస్యల బారిన పడతారో.. ఇప్పుడు తెలుసుకుందాం..!!
ప్రసవించిన మొదటి రోజు నుంచి చెవులలో దూది పెట్టుకోవాలి. బిడ్డకు తల్లి పాలు ఇవ్వాలి. బాలింతలు ప్రసవించిన ఎనిమిది రోజుల నుంచి శరీరానికి బలము నిచ్చే ఆహారాలు తీసుకోవాలి. ముఖ్యంగా బాలింతలకు 12వ రోజు వరకు మాంసాహారం పట్టకూడదు. తర్వాత అధిక రక్తస్రావం, నీరసం, అలసట వలన పలు వ్యాధులు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం బలం చేకూర్చడానికి దశమూలారిష్టం, సౌభాగ్య సొంటి లేని ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది. వీటిని ప్రతి రోజూ పది గ్రాముల చొప్పున తీసుకోవాలి. దీని వలన చక్కటి శక్తి కలుగుతుంది. ప్రసవించిన 15 రోజుల వరకు ఒంటి పూట భోజనం చేయాలి. గోరు వెచ్చని నీటిని తాగాలి. కాఫీ, టీ, రొట్టె తినాలి.
బాలింతలకు పత్యమైన ఆహారం ఇవ్వాలి. ముఖ్యంగా చల్లటి పదార్ధాలు తినకూడదు. నెయ్యి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోకూడదు. మీరు తీసుకునే ఆహారం బిడ్డ మీద ప్రభావం చూపుతుందని గమనించాలి. శారీరక శ్రమ లేకుండా చూసుకోవాలి. బాలింతలు ముఖ్యంగా కందికట్టు, ధనియాల పొడి, శొంఠి పొడి, నువ్వుల పొడి, వెల్లుల్లి పాయ కారం, ఇంగువ, పాత బెల్లం, ఉసిరికాయ పచ్చడి, పాత నిమ్మకాయ పచ్చడి వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి. అలాగే మునగ కాయ కూర, పొట్లకాయ కూర , బీరకాయ కూర, కంద కూర తరచూ తినాలి. నువ్వుల నూనె రాసుకుని వేడి నీటితో స్నానం చేయాలి. ఆవుపాలు ఎక్కువగా తాగాలి. బాలింతలు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. అలాగే తాంబూలం వేసుకోవాలి. ఇవన్నీ తప్పకుండా బాలింతలు పాటించాలి. అదే మాంసాహారం తీసుకునే వారు ఎండు చేపలు, కాల్చిన మాంసం, ఆవు నెయ్యి లో వేయించిన మాంసం, మేక మాంసం, ఎండు రొయ్యలు తినవచ్చు.
బాలింతలు కొత్త బియ్యం అన్నం తినకూడదు. ముఖ్యంగా చద్ది అన్నం, బాగా పలుకుగా ఉన్న అన్నం తినవద్దు. పచ్చి చేపలతో వండిన ఏ కూర తినరాదు. కొత్త చింత పండు తో చేసిన వంటకాలు, పులుసు కూరలు తినకూడదు. పెరుగు, మజ్జిగ అస్సలు వాడకూడదు. పైన చెప్పుకున్న జాగ్రత్తలు పాటించకపోతే బాలింతలకు సుతికా వ్యాధులు వస్తాయి. ఒక్కోసారి ఈ చిన్న వ్యాధులు 13 రకాల సన్నిపాత జబ్బులు గా మారి ప్రాణాంతకం కావచ్చు.