Exams : కరోనా కారణంగా మూతబడిన పాఠశాలలు మరియు కళాశాలలు ఇప్పుడిప్పుడే సజావుగా సాగుతున్నాయి. ప్రస్తుతం పిల్లలకు పరీక్షల సమయం సమీపిస్తుంది. ఈ సమయంలో పిల్లలకు ఏకాగ్రత ఎంతో అవసరం. తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు పిల్లల ఆరోగ్యం పై తగిన శ్రద్ద పెట్టడం చాలా ముఖ్యం. పిల్లలకు ఏ ఆహరం పోషణను ఇస్తుందంటే….
డార్క్ చాక్లెట్..
సాధారణంగా పిల్లలకు చాక్లేట్లు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. వీటిని రోజు తినడం మంచిది కాదు కానీ పరీక్షల సమయంలో మాత్రం వారికి బోర్ కొట్టినప్పుడు తినడానికి డార్క్ చాక్లెట్ ను అందుబాటులో ఉంచండి. డార్క్ చాక్లెట్ లలో ఉండే ఫ్లావోనాయిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
బెర్రీలు..
బెర్రీలు జ్ఞాపకశక్తి పెరుగుదలకు ఎంతో సహాయపడతాయి. బెర్రీ లలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో బ్రెయిన్ చాలా యాక్టీవ్ గా పనిచేస్తుంది.
నట్స్ మరియు విత్తనాలు..
పిల్లలకు పరీక్షా సమయంలో చిరుతిళ్ల బదులుగా గింజలు మరియు విత్తనాలను ఆహారంగా ఇవ్వండి. ఈ గింజల వలన ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి అందడంతో పాటుగా శరీరానికి అవసరమయిన ప్రొటీన్ మరియు ఫైబర్ శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఫలితంగా ఎక్కువ గంటల పిల్లలు శ్రద్ధగా చదువుకోగలరు.
గుడ్లు..
గుడ్లలో ప్రోటీన్ శాతం అధికంగా ఉండడంతో మెదడు ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది. ఇందులో ఉండే సెలినియంతో మరియు ఓమేగా-3 ఉన్నాయి. రోజులో ఏ సమయంలోనైనా పిలల్లకు గుడ్లను ఆహారంగా ఇవ్వవచ్చు.
ఓట్స్..
పిల్లలకు పరీక్షా సమయంలో అందించే ఆహారంలో కచ్చితంగా ఓట్ మీల్ ఉండేలా చూసుకోవాలి. ఓట్ మీల్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఓట్స్ ను అల్పాహారంగా పిల్లలకు ఇస్తే మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు మరియు జ్ఞాపకశక్తి పెంపొందించేందుకు ఇది బాగా సహాయపడుతుంది. ఓట్స్ లో పొటాషియం, విటమిన్-ఈ, అలాగే మెదడుకు మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి.