కివి పండులో లభించే విటమిన్లు, పోషకాలు మరే పండులో ఉండవు అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు.చూడటానికి దీని ఆకారం సపోట ని పోలిఉంటుంది. కానీ గుడ్డు ఆకారం లో ఉంటుంది. కోసి చూస్తే అనేక గింజల తో నిండిన ఆకుపచ్చ, పసుపు పచ్చని గుజ్జు తో ఉంటుంది.
ఇందులో విటమిన్లు సి, ఇ, ఫోలిక్ ఆసిడ్,పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, పీచు పదార్ధం, కెరోటినాయిడ్స్ వంటి పోషకాలు ఇందులో ఉంటాయి.ఇందులో కొవ్వు, సల్ఫర్ తక్కువగా ఉంటుంది కనుక గుండె, మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు తమ ఆహారం తో పాటు కివి తింటే ఫలితం కనిపిస్తుంది.కివి తిన్నవారి లో శరీరంలో రక్తం గడ్డకట్టే ప్రమాదం తక్కువ గా ఉంటుంది .
ఈ పండులో ఉండే లుయిటిన్ పదార్ధం కంటి చూపును కాపాడుతుంది.కివి నుంచి తీసిన రసం చర్మ క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఇక ఈ పండులోని ‘ఐనోసిటాల్’ పదార్ధం డిప్రెషన్ చికిత్స కు ఉపయోగపడుతుంది. గుండెకు రక్తం బాగా సరఫరా కావడానికి, కాలేయ క్యాన్సర్ రాకుండా ఉండడానికి , రక్తనాళాల్లో గట్టి పదార్ధం ఏర్పడకుండా కివి పండు సహకరిస్తుంది.కివి పండులో క్యాన్సర్కు దారితీసే జన్యు మార్పులను నిరోధించే పదార్ధం గుర్తించినట్లు పరిశోధనల్లో తెలిసింది.
కివి పండు లో ఫోలిక్ యాసిడ్ అధికం గా ఉండడం వలన గర్భం తో ఉన్న స్త్రీలు దీనిని తీసుకుంటే చక్కని ప్రయోజనం కలుగుతుంది. ఫోలిక్ యాసిడ్లు గర్భస్థ శిశువులో నరాల జబ్బులు రాకుండా చేస్తాయి. కివి తీసుకోవడం వలన గర్భవతికి తగిన మోతాదులో విటమిన్లు అందేలా చేస్తుంది.
పండ్లను ఆహారంగా తీసుకుంటే అందులోని చక్కెర శాతంమన శరీరం లో ఉండే మధుమేహాన్ని ఇంకాస్త పెంచుతాయి. అయితే వేరే పండ్లలో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ కివి లోతక్కువ స్థాయిలో ఉండడం వలన,ఇది రక్తం లోని చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. ఇక ఈ పండులో ఉండే నీటి శాతం కూడా,మధుమేహం తో ఉన్నవారు తీసుకునే డైట్కి సరిపోయేవిధంగా ఉంటుంది.