నువ్వులను రోజూ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. నువ్వులను ‘పవర్ హౌజ్’ అని పిలుస్తారు. నువ్వుల్లో మన శరీరానికి అవసరమైన ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటితోపాటు విటమిన్ ‘ఇ’ కూడా సమృద్ధిగా ఉంటుంది.
నువ్వులతో చేసిన వంటలు మన శరీరానికి చాలా బలాన్ని ఇస్తుంది. నువ్వులలో ఎన్నో పోషకాలు ఉన్నాయని అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నువ్వుల్లో ఇనుము శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తరచూ నువ్వులను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గి ఆరోగ్యంగా ఉంటారు.
నువ్వులు మరియు ఖర్జూరంతో చేసిన లడ్డూలు తినడం మన ఆరోగ్యానికి చాలా మంచింది. ఈ లడ్డులు తినడం వలన వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది మరియు జీర్ణక్రియను సాఫీగా జరుగుతుంది. రక్తపోటును సైతం ఇవి అదుపులో ఉంచగలవు. నువ్వులను తీసుకోవడం వలన కాన్సర్ కు దూరంగా ఉండవచ్చు.
నువ్వులలో ఉండే సెరొటోనిన్ ఒంటి నోప్పుల్ని తగ్గించి మీకు గాఢ నిద్రపట్టేలా చేసే గుణం కూడా నువ్వుల్లో ఎక్కువే ఉంటుంది. నువ్వులు మన శరీర ఎముకలను బలోపేతం చేస్తాయి. ఖర్జూరాల్లో ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఖర్జూరాలను తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు దూరంగా ఉండవచ్చు. ఖర్జూరాలు మన శరీరాన్ని రక్తపోటు నుంచి కాపాడుతుంది. ఈ లడ్డూలో ఉదర సంబంధ వ్యాధులకు చెక్ పెట్టే గుణాలు ఉన్నాయి. పండ్లతో పోలిస్తే ఖర్జూరాలలో ఫైబర్ ఎక్కువ. ఈ రెండింటిని లడ్డూల రూపంలో రోజుకి ఒకటి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.