మైగ్రేన్ ని తెలుగులో పార్శ్వపు నొప్పి అంటారు.తలలో ఒక పక్క మాత్రమే విపరీతమైన నొప్పి కలుగుతూ ఉంటుంది.ఈ మధ్య కాలంలో ఈ మైగ్రేన్ బారిన పడుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉంది.మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు,నిద్ర వేళలో మార్పులు వంటి ఇతర కారణాల వల్ల మైగ్రేన్ దాడి చేస్తుంది. విపరీతమైన తలనొప్పితో చాలామంది బాధపడుతుంటారు. మైగ్రేన్గా చెప్పుకునే ఈ సమస్యతో బాగా ఇబ్బంది పడుతుంటారు. అలాంటివారు కొన్ని చిట్కాల ద్వారా సమస్య ను తగ్గించుకోవచ్చు.
- ఒత్తిడి ,ఉద్వేగము కలిగించే జీవనశైలి నుండికొన్ని కొన్ని మార్పుల తో సాధారణ జీవిత విధానాన్నిఅలవాటు చేసుకోవాలి.
- మంచి నీళ్ళు,పళ్లరసాలు ,కొబ్బరినీళ్లు ,మజ్జిగ వంటి ద్రవ పదార్ధాలు ఎక్కువ గా తాగాలి.
- ఇంట్లో ఉన్నప్పుడు మీరు విశ్రాంతి తీసుకునే గది చీకటిగా ఉంచి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవాలి.
- నీటిలో తడిపిన బట్టను తల మీద వేసుకొని విశ్రాంతి గా ఉన్న కొంత ఉపశమనం కలుగుతుంది.
- దోర జాంపండు ని సానరాయి మీద అరగదీసి గంధం చేసి నుదుటి మీద లేపనంగా రాసుకోవడం వలన తలనొప్పి తగ్గుతుంది.
- మైగ్రేన్ తో బాధపడేవారు దీనిని సూర్యోదయానికి ముందుచేస్తే మంచి ఫలితం కలుగుతుంది.
- అల్లం ని ఉపయోగించడం వల్ల కూడా సమస్యను అదుపులోకి తేవచ్చు. ఆహారంలో అల్లం చేర్చుకోవడం వల్ల చలికాలంలో వేధించే జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి.
ఆక్యుప్రెషర్ ప్రక్రియ వల్ల మైగ్రేన్ త్వరగా తగ్గుతుందని 2014లో కొన్ని పరిశోధనలు తెలియచేశాయి. ఇందులో భాగంగా చేతివేళ్లతో, తల దగ్గర రాయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. కొన్ని యోగాసనాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల మైగ్రేన్ అదుపులో ఉంటుంది. ఇందులో ముఖ్యంగా ప్రాణాయామ శ్వాసకు సంబంధించిన ఆసనాలు చేయడం వల్ల చాలా ఉపయోగం కలుగుతుంది.
లావెండర్ ఆయిల్ ని వాసన చూడడం, నొప్పిగా ఉన్న భాగంలో రాయడం వల్ల మైగ్రేన్ తలనొప్పి తేలికగా తగ్గుతుంది. చలి ఎక్కువగా ఉంటే తలనొప్పి పెరుగుతుంది. అందుకే సాధ్యమైనంత వరకూ చలిలో బయట తిరగడం మానుకోవాలి.