ఈ మధ్యకాలం లో చాలా మందిని కిడ్నీ సమస్య వేధిస్తుంది. కిడ్నిలో స్టోన్స్ గురించి చాలా మందికి అవగాహన లేక అందోళన చెందుతుంటారు. కిడ్నిలో స్టోన్స్ ఎలా ఏర్పడుతాయి? కిడ్ని స్టోన్స్ లక్షణాలు ఏమిటి? మరియు నివారణ గురించి తెలుసుకుంటే కిడ్నీలో స్టోన్స్ ఏర్పకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. మూత్రపిండంలో లేదా మూత్ర నాళంలో ఏర్పడే ఒక హార్డ్ మరియు స్ఫటిక ఆకారంలో ఉండే ఖనిజ పదార్థనీ కిడ్నీ లో స్టోన్స్ అంటారు. కిడ్నీల్లో రాళ్లు చేరడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదురుకోవలసి ఉంటుంది.
కిడ్నీలో రాళ్ళతో బాధపడే వారు డాక్టర్ సలహాను పాటిస్తూ, అందుకు తగిన ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకుంటే ఆ రాళ్లను కరిగించుకుని ఆ సమస్య నుంచి త్వరగా భయటపడొచ్చు. ప్రతి రోజు ఉదయం తులసి ఆకుల రసంలో కొంచెం తేనెను కలుపుకుని తాగితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. ఇలా 6 నెలలపాటు క్రమం తప్పకుండా చెయ్యడం వల్ల కీడ్నీలో రాళ్లు త్వరగా కరిగిపోతాయట.
కిడ్నీలో స్టోన్లు రాకుండా ఉండడానికి యాపిల్ ను ఎక్కువగా తీసుకోవాలి.ప్రతి రోజు ఒక యాపిల్ ను తింటే కిడ్నీలో రాళ్లు సమస్య నుంచి మీరు భయటపడొచ్చు. ప్రతి రోజు యాపిల్ను తినడం వల్ల ఒకవేళ రాళ్లు ఉన్నా కరిగిపోతాయి. కిడ్నీలో రాళ్లు సమస్య ఉన్నవారు ద్రాక్షపళ్లను మీ డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు డాక్టర్లు. అలాగే పుచ్చకాయలను తరచు గా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి. రోజు ఉదయం మరియు సాయంత్రం భోజనానికి ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ను కలుపుకొని తాగడం వల్ల కిడ్నీలో స్టోన్లు త్వరగా కరిగిపోతాయి.