Bharat Biotech: కోవాక్సిన్తో టీకాలు వేసిన తర్వాత పారాసెటమాల్ లేదా పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన అవసరం లేదనీ కోవాగ్జిన్ టీకా తయారీదారు భారత్ బయోటెక్ తెలిపింది. తాము ఆ ట్యాబ్లెట్ వాడాలని సూచించలేదని బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది భారత్ బయోటెక్. కొన్ని వ్యాక్సిన్ కేంద్రాల్లో పిల్లలకు కోవాక్సిన్తో పాటు మూడు పారాసెటమాల్ 500 ఎంజీ టాబ్లెట్లను సిఫార్సు చేస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని పేర్కొంది ఆ సంస్థ. తమ సంస్థ పారాసెటమాల్ లేదా పెయిన్ కిల్లర్ ను సిఫార్సు చేయలేదని వెల్లడించింది.
Bharat Biotech: ఎలాంటి మందులు వాడవద్దు
దేశంలో 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు జనవరి 3వ తేదీ నుండి వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కోవాక్సిన్ మాత్రమే ఈ వర్గానికి టీకాలు అందిస్తోంది. 30 వేల మంది వ్యక్తులకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా 10-20 శాతం మందికి మాత్రమే స్వల్ప సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని భారత్ బయోటెక్ చెప్పింది. ఇవి చాలా తేలికపాటి సైడ్ ఎఫెక్ట్స్ యేనని ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతాయని తెలిపింది. ఎలాంటి మందులు వాడవద్దని వెల్లడించింది. ఏదైనా ఇబ్బంది ఉంటే వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మందులు తీసుకోవాలని పేర్కొంది. వేరే ఇతర వ్యాక్సిన్ లు తీసుకున్న వారికి పారాసెటమాల్ తీసుకోవాలని సూచిస్తున్నారనీ, కోవాగ్జిన్ కు అవసరం లేదని స్పష్టం చేసింది.
Read More: Central Guidelines: కేంద్రం ఆదేశాలు.. కోవిడ్ వస్తే ఐసోలేషన్ లో ఏడురోజులు ఉంటే చాలు
2.Cheating: ఆ ఆలయ ఇఓ అవినీతిపై మంత్రి వెల్లంపల్లికి ఫిర్యాదు..?
3.AP Employees JAC: రేపు సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ..? సంక్రాంతికి గుడ్ న్యూస్ ఖాయమే..!!