హైదరాబాద్ hyderabad బోయిన్పల్లి కిడ్నాప్ kidnap కేసులో అరెస్టు అయిన ఏపి మాజీ మంత్రి భూమా అఖిలప్రియ bhuma akhila priya కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. సికింద్రాబాద్ కోర్టులో అఖిలప్రియ బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు జరిగాయి. పిటిషనర్ ప్రస్తుతం గర్భవతి అని, ఆమెపై రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కేసు పెట్టి అరెస్టు చేశారనీ అఖిలప్రియ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఆమె ఆరోగ్య రీత్యా వైద్య సదుపాయం అవసరమై ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని కోరారు. విచారణకు సహకరిస్తామనీ, విదేశాలకు వెళ్లకుండా పాస్ పోర్టు సెరెండర్ చేస్తామనీ కూడా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
అయితే ప్రభుత్వం తరపు న్యాయవాది ఆమె బెయిల్ పిటిషన్ పై అభ్యంతరం వ్యక్తం చేశారు. అఖిలప్రియ రాజకీయ నాయకురాలనీ, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనీ, కిడ్నాప్ కేసు విచారణ కీలకదశలో ఉన్నందున బెయిల్ ఇవ్వవద్దంటూ వాదనలు వినిపించారు. అదే విధంగా పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతులు ఇవ్వాలని కోరారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. అఖిలప్రియ బెయిల్ పిటిషన్ ను కొట్టివేశారు. ఆమెను ఈ నెల 13వ తేదీ వరకూ విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది కోర్టు. అయితే విచారణ సమయంలో ఆమె తరపు న్యాయవాదితో మాట్లాడవచ్చని న్యాయమూర్తి తెలిపారు. ఆమెకు అవసరమైన వైద్య సహాయం అందించడంలో అలక్ష్యం చేయవద్దని న్యాయమూర్తి సూచనలు చేశారు. అఖిలప్రియకు బెయిల్ మంజూరు కాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు నిరుత్సాహానికి గురైయ్యారు.
భూ వివాదం నేపథ్యంలో ఇటీవల బోయిన్పల్లికి చెందిన ప్రవీణ్ రావుతో సహా అతని ఇద్దరు సోదరులను అఖిలప్రియకు చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేశారన్న అభియోగంపై కేసు నమోదు చేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ 3 నిందితుడుగా ఉన్న అఖిలప్రియ భర్త భార్గవరామ్ పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి..భూమా అఖిలప్రియపై భారీ కుట్ర…..రంగంలోకి అమిత్ షా మనిషి?