కరోనా గ్యాప్ లో ఆలోచించగా ఆలోచించగా ఆలోచనలు మారాయో లేక సుబ్బారెడ్డి ఎఫెక్టో అదీగాక అధిష్టాణం పట్టించుకోవడంలేదని అలకో.. అదీగాక ఈ రంగంలో కూడా రాణించే ప్రాయత్నం చేద్దామని తాపత్రయమో తెలియదు కానీ… సినీ ఇండస్ట్రీవైపు చూస్తున్నారంట భూమా అఖిల ప్రియ.ఆంధ్రప్రదేశ్ మాజీ టూరిజం శాఖా మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసిన అఖిల ప్రియ ఆ ఎన్నికల్లో ఓటమి పాలయినదగ్గరనుంచి రాజకీయంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని, స్థానికంగా పట్టుకోల్పోతున్నారని వార్తలొస్తున్నాయి.
ఇలాంటి సమయంలో కూడా చంద్రబాబు నుంచి ఎలాంటి మద్దతూ తనకు దొరకడం లేదని ఆమె తన సన్నిహితులవద్ద వాపోతున్నారని తెలుస్తొంది. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తీసుకుని.. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలని చూస్తున్నారంట.
ఇందులో భాగంగా… రాజకీయంగా ఓడిపోయినా కానీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి సక్సెస్ అవ్వాలని ప్లాన్ చేసుకుందట. ఈ నేపథ్యంలో అఖిల ప్రియ తన భర్త భార్గవ్ నాయుడు తో కలిసి మూవీ ప్రొడక్షన్ హౌస్ ఒకటి స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట. కరోనా ఎఫెక్ట్ వల్ల అన్నీ తారుమారయ్యాయి కానీ.. లేదంటే ఈ విషయంలో ఎప్పుడో ఒక స్టెప్ పడిపోయి ఉండేదని అంటున్నారు!
మరి ఈ ప్రొడక్షన్ హౌస్ కి తల్లి పేరు కలిసొచ్చెలా పెడతారా.. తండ్రి పేరున పెడతారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ నిర్ణయం ద్వారా.. సినిమాలు – రాజకీయం వేరు వేరు అని గ్రహిస్తారో లేక అక్కడకీ ఇక్కడకీ పెద్ద తేడా లేదని అనుభవం పొందుతారో వేచి చూడాలి!