అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠతను కల్గిస్తోంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడన్ మధ్య పోరు ఉత్కంఠగా సాగుతోంది. అనేక కీలక రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు.
అయితే అధ్యక్ష పదవిని నిర్ణయించే ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లలో మాత్రం జోబైడన్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు. కీలక రాష్ట్రాలైన ప్లోరిడా, జర్జియాల్లో ట్రంప్ ఆధిక్యతకను కనబరిచారు. న్యూజెర్సీ, న్యూయార్క్, న్యూమెక్సికో, వర్జీనియా వంటి రాష్ట్రాల్లో జో బైడన్ ముందున్నారు. ఎన్నికల ఫలితాల సరళిలో ఇప్పటి వరకూ జో బైడన్ 224.. ట్రంప్ 213 ఎలక్ట్రోరల్ కాలేజీ ఓట్లు సాధించారు.
మొత్తం 580 ఓట్లకు గానూ 270 గెలుచకున్న వారే అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. దాదాపు అన్ని ప్రీ పోల్స్ జో బైడన్కు అనుకూల ఫలితాలు ఇచ్చాయి. ట్రంప్ ఇప్పటివరకూ 21 రాష్టరాలను, బైడన్ 19 రాష్ట్రాలను గెలుచుకున్నారు. ట్రంప్, బైడన్ల మద్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ జరిగినట్లు ఓట్ల లెక్కింపు సరళిని పరిశీలిస్తే అర్థం అవుతోంది. దీంతో గెలుపు ఎవరిది అనేది చివరి వరకూ చెప్పడం కష్టతరంగా ఉందని అంటున్నారు.