బిగ్ బాస్ షో లో మాట మార్చడం ఎదుటి వారిపై నిందలు వేయడం తమ తప్పులను తెలుసుకోలేకపోవడం చాలా సర్వసాధారణం. అలాగే ఇటువంటి అవకాశాలను ఇచ్చేందుకు బిగ్బాస్ ఎప్పుడూ రెడీగా ఉంటాడు. తమ తప్పును తెలుసుకొని ఆటలో ముందుకు వెళ్లడానికి కూడా తప్పు చేస్తున్నాను అని తెలుసుకోలేక పోయాడు.
దీపావళి సందర్భంగా వెలిగే దీపం ఆరిపోయే దీపం టాస్క్ లో చాలామంది సేఫ్ గేమ్ ఆడారు. వెలిగే దీపం అంటూ ఒకరినొకరు ఇచ్చుకున్నారు. లాస్య-హారిక, సోహెల్-మెహబూబ్, అవినాష్-అరియానా ఒకరినొకరు ఇచ్చుకున్నారు. కానీ ఆరిపోయే దీపం మాత్రం చాలా మంది అరియానాకే ఇచ్చారు. మెహబూబ్ వంతు వచ్చినప్పుడు వెలిగే దీపం సోహెల్ కి ఇచ్చిన మెహబూబా ఆరిపోయే దీపం అరియానా ఇచ్చాడు.
అరియానా కెప్టెన్గా ఉన్నప్పుడు ఆమె అందరికీ పనులు అప్పగించలేదని… కొందరు కంఫర్ట్ గా ఉండడం తనకు కావాలి అని చెప్పిందంట. అందుకు అరియానా నచ్చలేదని ఆరిపోయే దీపం గా చెప్పాడు. అరియానా ఇలాంటి తప్పు చేసిందని మహబూబ్ చెప్పిన తర్వాత తాను కూడా గతంలో ఇలాంటిదానిలోనే భాగస్వామి అయ్యాడు అని గ్రహించలేకపోయాడు.
రాజశేఖర్ కెప్టెన్ గా ఎన్నికైన తర్వాత మెహబూబ్ మంతనాలు ఆడాడు. మీకు నచ్చిన పని చేయండి అని… ఈజీ పని తీసుకోండి మిగతా వాళ్ళకి నేను వేరే ప్లాన్ చేశాను అని చెప్పాడు. సభ్యులందరికీ పనుల కేటాయించగా మెహబూబ్ అవినాష్ కు ఎక్కువ పని అప్పగించాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ ఒళ్ళు మండిపోయి అరుస్తుంటే సంబరంగా డాన్స్ వేసాడు. అలాంటి మెహబూబ్ అమ్మరాజశేఖర్ విషయంలో తప్పు చేసి అరియానా ను నిందించడం ఎంతవరకు కరెక్ట్ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది అతని నిజ స్వరూపం అని మండిపడుతున్నారు