బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో తొమ్మిదో వారంలో ఇంటి సభ్యుల మధ్య ఆగ్రహావేశాలు బయట పడ్డాయి. నామినేషన్ సందర్భంగా ఇమ్యూనిటీ లభించేందుకు బిగ్ బాస్ అవకాశం ఇచ్చిన టాస్క్ లో రాజశేఖర్, అవినాష్, అఖిల్, అభిజిత్, హారిక, మోనాల్ ను చిత్రహింసలు పెట్టారు. ఈ సందర్భంగా ముఖం దాఛుకో టాస్క్ లో ఒకరి కన్నా ఎక్కువ మంది స్టాండ్ పైన బజర్ మోగే సమయానికి ఉండడంతో ఎవరికీ ఇమ్యూనిటీ లభించలేదు.
ముఖంపై చెత్త, గుడ్లు, మట్టి కొట్టి ప్రతి ఒక్కరిని ఇరిటేట్ చేసేందుకు ప్రయత్నించారు. షేవింగ్ ఫోమ్, కూల్ ఐస్ వంటి వాటిని కూడా ముఖంపైన కొట్టారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ తనకు ఇదంతా చాలా కష్టంగా అనిపించింది అని కానీ తప్పదు అని అన్నాడు. ఇంటిలోకి వచ్చే సమయంలో బయట తాను ఎన్నో అవమానాలకు గురి అయ్యాను అని తన బాధలను చెప్పుకొచ్చాడు. నేను చేసే షో నిర్వాహకులు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అగ్రిమెంట్ ఉన్న కారణంగా ఇంట్లోకి రావడానికి తనకు చాలా కష్టంగా మారిందని అన్నాడు.
ఒకసారి బయటికి వెళ్తే మళ్లీ తీసుకోమని చెప్పారు…. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకునేందుకు చాలా కష్టాలు పడ్డాను, అవమానాలు భరించాను బయటికి వెళ్తే నాకు ఇంకొక ఆప్షన్ కూడా లేదని అన్నాడు. ఇక గతంలో కూడా తనకు ఆర్థిక కష్టాల్లో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించానని అవినాష్ తెలపడం విశేషం. ఇక తనకు బయట ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ ఇంటిలో రాణించడానికి చాలా కష్టపడుతున్నాను ఇది నాకు చాలా ముఖ్యం అని అవినాష్ చెప్పడం గమనార్హం.
దీని కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తానని అవినాష్ అన్నాడు. ఈ సందర్భంగా జబర్దస్త్ కార్యక్రమం నుండి అవినాష్ తప్పుకునేందుకు నిర్వాహకులు బాగా ఇబ్బంది పెట్టారని వార్తలు బయటకు వస్తున్నాయి. అలాగే ఇంట్లోకి రావడానికి కారణంగా వారికి కొంత మొత్తం చెల్లించాలని విషయం కూడా ప్రచారం అయింది. ఈ అంశంమే అవినాష్ గత ఎపిసోడ్ లో క్లారిటీ ఇచ్చేశాడు అని అంటున్నారు.