బిగ్ బాస్ నాలుగో సీజన్ 9వ వారం ప్రస్తుతం విజయవంతంగా నడుస్తోంది. ఈ వారం ఎప్పటిలాగే మసాలా మరింత ఎక్కువైంది. ఇంటిలో సభ్యులందరిలో ఆగ్రహావేశాలు బయటికి వచ్చాయి. లవ్ ట్రాక్ లు కూడా మారిపోయాయి. ఇక ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్ లకు ఎంత మొత్తం ఇస్తున్నారు అన్న విషయంపై ఇప్పటి వరకు ఎన్నో ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. తాజాగా ఇంటి సభ్యులకు బిగ్బాస్ నిర్వాహకులు ఇస్తున్న పారితోషికం విషయం బయటికి అనధికారికంగా బయటకు వచ్చింది. ఈ జాబితా ఒకసారి చూస్తే…
సాధారణంగా క్రేజ్, పాపులారిటీని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ లో బిగ్ బాస్ షో నిర్వాహకులు రేటు ని నిర్ణయిస్తారు. ఎక్కువ క్రేజ్ ఉన్న సెలబ్రిటీలకు రోజు వారి చొప్పున పారితోషికాన్ని చెల్లిస్తారు. ఇప్పటివరకు ఈ షోలో పాల్గొన్న 19 మంది సెలబ్రెటీలు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్, కుమార్ సాయి కి వారానికి రెండు లక్షల చొప్పున చెల్లించారు. ఇక సుజాతకు కూడా వారానికి రెండు లక్షలు లెక్కగట్టినట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం బిగ్ బాస్ షో లో స్టార్ కంటెస్టెంట్ గా మారిన అఖిల్, దివి లకు అలాగే ఎంటర్టైన్ చేస్తున్న అవినాష్, సోహెల్, మెహబూబ్, అరియానా వారానికి రెండున్నర లక్షల చొప్పున చెల్లించినట్లు తెలుస్తోంది. వీరితోపాటు వారానికి మూడు లక్షలు తీసుకుంటున్న వారు కూడా ఉన్నారు ఆ వరుసలో కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి, గంగవ్వ, సూర్యకిరణ్ వారానికి మూడు లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంట్లో గ్లామర్ పంట పండిస్తున్న దేత్తడి హారికకు కూడా వారానికి మూడు లక్షలు ఒప్పందం జరిగినట్లు చెబుతున్నారు.
అభిజిత్, రాజశేఖర్ కు కూడా ఇలాగే వారానికి మూడు చెల్లించే విధంగా అగ్రిమెంట్ జరిగినట్లు సమాచారం. అందరికన్నా ఎక్కువ తీసుకున్న వారి లిస్టులో మొదటగా లాస్య మంజునాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతోపాటు ఆరోగ్య కారణాల వలన ఎలిమినేట్ అయిపోయిన నోయల్ సీన్ కు వారానికి ఏడు లక్షల చొప్పున చెల్లిస్తున్నట్లు తెలిసింది. వీరందరితో పోలిస్తే అత్యధికంగా మోనాల్ గజ్జర్ కి వారానికి రూ. 11 లక్షలు చెల్లిస్తున్నట్లు సమాచారం. వివరాలు అనధికారం అయినప్పటికీ దాదాపు ఇంతే మొత్తం చెల్లిస్తున్నట్లు తెలిసింది.