బిగ్ బాస్ నాలుగవ సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. గెలుపోటముల గురించి పక్కన పెడితే… చివరిరోజున టైటిల్ విన్నర్ ప్రకటించే స్టార్ ఎవరు అనే విషయం ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ముగ్గురు అగ్ర హీరోల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
అయితే ఈ ముగ్గురిలో ఎవరు వచ్చి టైటిల్ విజేతను ప్రకటిస్తారు అన్న విషయంపై అధికారికంగా క్లారిటీ లేదు. అయితే ఆ ఒక్క హీరో మాత్రం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ సీజన్ మొదలైనప్పుడు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆఖరికి శని ఆదివారాలు కూడా రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి అని టాక్ వచ్చింది. అప్పుడప్పుడు నాగార్జున మ్యాజిక్ క్రియేట్ చేస్తే పైకి లేచింది షో. ఒక సారి సమంత వచ్చినప్పుడు పండుగ రోజు భారీ రేటింగ్స్ వచ్చాయి.
ఇక ఫైనల్ కు కావాల్సినంత బజ్ రావాలి అంటే ఒక స్టార్ హీరో కచ్చితం. ఇక మొదటి నుండి కూడా ఎన్టీఆర్ వస్తాడని ఎన్నో కథనాలు వచ్చాయి. నిర్వాహకులకు జూనియర్ ఎన్టీఆర్ వస్తానని మాట ఇచ్చినట్లు కూడా చెప్పారు. అయితే ప్రస్తుతానికి ఎన్టీఆర్ ఇప్పుడు రావడం కుదరదని క్లారిటీ ఇచ్చినట్లు టాక్ వైరల్ అవుతోంది. ఇక గత సీజన్ ఫైనల్స్ లో ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈసారి కూడా వస్తాడన్న వార్తల్లో నిజం లేదని ఆచార్య షూటింగ్ లో బిజీగా ఉన్నాడని అంటున్నారు.
ఇక తాజాగా బయటకు వచ్చిన మరొక పేరు సూపర్ స్టార్ మహేష్ బాబుది. ఇప్పటి వరకు అసలు అతను బిగ్ బాస్ వైపు చూడలేదు. ఇక మహేష్ తో టైటిల్ విన్నర్ అనౌన్స్ చేయించాలని ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. మహేష్ ఒప్పుకుంటే మాత్రం దెబ్బకు షో రేటింగ్స్ పెరిగి పోవడం ఖాయం. ఇక ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు చీఫ్ గెస్ట్ గా వస్తారు అని తెలుస్తోంది.