నాలుగో సీజన్ బిగ్బాస్ ఇంటిలో 16 మంది కంటెస్టెంట్లతో మొదలైంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ లతో కలిపి 19 మంది అయ్యారు. అయితే చివరాఖరికి అతికొద్దిమంది మిగిలారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ లుగా చెప్పబడే వారు ఎలిమినేట్ కావడం…. మొదట్లో అసలు పట్టించుకోని కంటెస్టెంట్ లకు ఎంతో ప్రేక్షకాదరణ పొందడంలో చూస్తూనే ఉన్నాం. ఎంటర్టైన్మెంట్, లవ్ ట్రాక్ లకి మాస్ మసాలా కి ఎలాంటి వెలితి లేకుండా షో నడుస్తోంది.
నాగార్జున కూడా తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇలా అన్నీ జరుగుతున్న సమయంలో ఎలిమినేషన్ పై అభిమానులకు అనుమానం రావడం మొదలైంది. ఎవరైతే ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారో వారు ఇంట్లోనే ఉండిపోతున్నారు. పక్కా ఫైనలిస్టు అనుకుంటున్న వారు మాత్రం ఎలిమినేట్ అయి బయటికి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి సమయంలో ఇక ఈ సీజన్లో టైటిల్ కోసం ఫైనలిస్టు కాగలిగే సత్తా ఉన్న అతికొద్దిమంది కంటెస్టెంట్ లో ఐదుగురిని మాత్రం అందరూ బాగా ఆదరిస్తున్నారు.
మన మొదటి నుండి గమనించినట్లయితే అభిజిత్ టైటిల్ కోసం స్ట్రాంగ్ కంటెస్టెంట్. అలాగే అతనితోపాటు అఖిల్ కూడా అదే రేంజ్ లో పోటీ పడతారు. లాస్య మంజునాథ్ కి బయట ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. వీరితోపాటు అరియనా మంచి ఫైట్ ఇస్తుంది. వీరు నలుగురూ కాకుండా అవినాష్ కామెడీ ని నమ్ముకుని ఫైనల్ చేరవచ్చని అంచనా వేస్తున్నారు. మొత్తానికి మీరు ఐదుగురు మధ్యలోనే టైటిల్ పోటీ ఉంది అని అందరూ అనుకుంటున్నారు. మెహబూబ్. సోహెల్ కొద్దిగా ప్రయత్నిస్తే ఫైనల్ వరకు రావచ్చు కానీ వారికి అది మాత్రం చాలా చాలెంజింగ్ విషయం.