మరికొన్ని రోజుల్లో కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్న బిగ్ రియాలిటీ షో మొదలవబోతున్న సంగతి తెలిసిందే. ప్రతీ సీజన్ కి ప్రోమో తోటే అంచలాను పెంచేసే బిగ్ బాస్ నిర్వాహకులకి ఈ సారి అంత సీన్ ఉంటుందా అన్న కామెంట్స్ వినిపించాయి. కరోనా కారణంగా ఈ ఏడాది బిగ్ బాస్ నిర్వహించడం కష్టం అని అందరూ భావించడమే. దాదాపు 90 శాతం జనాలు ఫిక్సైపోయారు.. ఈసారికి బిగ్ బాస్ లేనట్టే అని.
కాని స్టార్ మా యాజమాన్యం మైండ్ బ్లాక్ అయ్యో షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ కన్ఫర్మ్ చేస్తూ ఒక ప్రోమో..నాగార్జున హోస్ట్ అని డిక్లేర్ చేస్తూ మరో ప్రోమో ని వదిలి సర్ప్రైజ్ ఇచ్చారు. ముఖ్యంగా నాగ్ 3 గెటప్పుల్లో ఉన్న ప్రోమో అందరికీ విపరీతంగా నచ్చింది. అంతేకాదు ఈ ప్రోమో రిలీజ్ అయినప్పటి నుంచి ప్రేక్షకుల్లో రోజు రోజుకీ ఉత్కంఠత పెరిగిపోతూ ఉంది. ఒక వైపు కంటెస్టెంట్స్ ఎవరెవరు అని క్యూరియాసిటీ.. మరో వైపు ఈసారి టాస్కులు ఎలా ఉండబోతున్నాయి అని.
జనాలు ఎంత ట్రై చేసినా కంటెస్టెంట్ లు ఎవరన్నది క్లారిటీ రావడం లేదు. కాకపోతే కొంతమంది పేర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే యూట్యూబ్ స్టార్స్ గంగవ్వ, అలేఖ్య హారిక, మెహబూబ్ షేఖ్, అమ్మ రాజశేఖర్, లాస్య మంజునాథ్, జబర్దస్త్ అవినాష్, సయెద్ సోహైల్ ర్యాన్, నోయెల్ సేన్, కరాటే కళ్యాణిలు బిగ్ బాస్ 4లో ఉంటారని తెలుస్తోంది. మొన్నటి వరకు సింగర్ సునీత, శ్రద్ద దాస్, బిత్తిరి సత్తి .. పేర్లు వినిపించాయి. అయితే సునీత, బిత్తిరి సత్తి కరోనా బారిన పడటంతో వేరే వాళ్ళని రీ ప్లేస్ చేసినట్టు సమాచారం.
ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం తేజ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో రత్తాలు రత్తాలు అన్న ఐటెం సాంగ్ లో నటించిన మణిచందన బిగ్ బాస్ 4 లోకి ఎంట్రీ ఇవ్వబోతోందని తెలుస్తోంది. నిజం తర్వాత ఆజాద్, పెళ్ళాం వచ్చింది, ఓ ప్రియతమా.. సినిమాల్లో నటించింది మణిచందన. మద్యలో గ్యాప్ తీసుకున్న మణి చందన రీసెంట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఉంగరాల రాంబాబు, ఆచారి అమెరికా యాత్ర సినిమాల్లో నటించింది. ఇక బ్యూటీ నిజంగా బిగ్ బాస్ 4 లో పాల్గొంటే మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ తనకే ఓట్ చేస్తారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ కంటెస్టెంట్స్ అందరూ కన్ఫర్మ్ గా బిగ్ బాస్ లో పాల్గొనబోతున్నారా లేదా అన్నది అధికారకంగా వెల్లడి కావాల్సి ఉంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!