బిగ్ బాస్ నాలుగవ సీజన్ లో ఇంట్లో ఆదివారం సండే-ఫన్ డే గా సాగిపోయింది. ఇంట్లో వారంతా అందంగా ముస్తాబై హోస్ట్ నాగార్జున ఆడించే ఆటలు ఆడేందుకు సిద్ధం అయిపోయారు. ఇక నాగార్జున కూడా వచ్చి రాగానే సభ్యులందరికీ ఉత్సాహాన్ని కలిగిస్తూ జోష్ పెంచేశారు. ఇంటి సభ్యులను రెండు టీం లుగా విడదీసి ఆటలు ఆడించారు.
ముందుగా తొలి ఆటగాడు డాట్స్ గురి చూసి కొట్టాలి. దివి, అభిజిత్ చెరు మూడు బెలూన్స్ పగలగొట్టడం తో గేమ్ టై అయింది. దాంతో మరో ఛాన్స్ ఇవ్వడంతో ఈ సారి దివి సక్సెస్ఫుల్ గా పగులగొట్టడంతో ఆమె విజయం సాధించింది. ఆ తర్వాత ఆర్మ్ ఆహ్ రెజ్లింగ్ గేమ్ ప్రేక్షకులకు వినోదం పంచింది. మోనాల్ పై ఈ గేమ్ లో ఒక సారి హారిక గెలిస్తే శరీర బరువుతో గెలిచింది అని చెప్పి మరోసారి పోటీ పెట్టారు. రెండోసారి నిర్వహించిన పోటీల్లో కూడా హారిక గెలిచింది.
మరో గేమ్ ను బిగ్ బాస్ నిర్వహించారు.ప్లాస్టిక్ బంతులని బుట్టలో వేసే గేమ్ లో లాస్య 15 బంతులను బుట్టలో వేయగా అఖిల్ 12 తో సరిపెట్టుకున్నట్లు తెలిపారు. ఈ గేమ్ లో లాస్య విజయం సాధించింది. ఇక నాగార్జున కూడా బుట్టలో వేయడం నీకు బాగా తెలుసు అని లాస్యను ఆట పట్టించాడు. ఇక చివరిగా బంతిని చేతితో కొడుతూ కొంత దూరం వెళ్లి తిరిగి వచ్చే ఆటను నాగార్జున ఆడించాడు. ట్రాక్ లో బంతిని కొడుతూ వెళ్లి వచ్చే క్రమంలో అవినాష్ లైన్ తప్పడంతో కుమార్ సాయి విజేతగా ప్రకటించారు.
ఇంకా బిగ్ బాస్ చివరిగా టగ్ ఆఫ్ వార్ నిర్వహించగా అందులో అఖిల్ టీమ్ గెలిచి ఛాంపియన్షిప్ ను సాధించింది.