ఎన్నో అంచనాల నడుమ మొదలైన బిగ్ బాస్ నాలుగో సీజన్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. విమర్శలు వస్తున్నప్పటికీ మంచి టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక సంఘటన పై మరిన్ని అనుమానాలు రేకెత్తించింది. బిగ్బాస్ అంటేనే బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఆరంభం నుండి మంచి రేటింగ్స్ సాధిస్తూ ఈ సీజన్ కూడా నెంబర్ వన్ పొజిషన్లో ఉంది.
అయితే గత మూడు సీజన్లలో మొత్తం ఒకే తరహాలో జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. లవ్ ట్రాక్స్, వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు ఒకే రకమైన అన్నీ అదే తరహాలో ఉన్నట్లు చెబుతున్నారు. ఇక ఈ సీజన్ బిగ్బాస్ కొద్దిగా మార్చినట్లు తెలుస్తోంది. ఇక ఓటింగ్ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ప్రతి హోస్ట్ అదేపనిగా వివరిస్తుంటారు. అయినప్పటికీ ఈ సీజన్లో ప్రేక్షకాదరణ ఉన్న కంటెస్టెంట్ లు ఎలిమినేట్ అవుతుండడంతో ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు.
అంతేకాకుండా ప్రస్తుతం బయటకు వస్తున్న టాక్ ఏమిటంటే…. లోనికి వెళ్లి వచ్చిన ప్రతి కంటెస్టెంట్ తో “లోపల జరిగేది నిజమేనా…. లేదా డైరెక్షన్ ప్రకారం నడుస్తుందా అని ప్రశ్నలు వస్తున్నాయట” ఇది రియాలిటీ షో అని పేరుకే అని కొందరు అంటున్నారు. అయితే అందులో జరిగే పరిణామాలు కూడా అనేక సందేహాలు రేకెత్తించేలా ఉన్నాయి. అఖిల్ వ్యవహారమే ఇందుకు కారణం.
బుధవారం ఎపిసోడ్ లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారు అని తెలిసికూడా కంటెస్టెంట్ లు తమ స్నేహితులను నామినేట్ చేశారు. అంతే కాకుండా ఈ వారం అసలు నామినేషన్స్ లో లేని అఖిల్ ను బయటకు పంపించేందుకు ఎంచుకున్నారు. దీంతో అఖిల్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్తే ఆసక్తిగా ఉంటుంది అని ఎలా అయితే బిగ్ బాస్ అనుకున్నారో చివరకు సీక్రెట్ రూమ్ కి అనూహ్యరీతిలో అతనినే పంపడం జరిగింది.
దీంతో ఒక్కసారిగా మొత్తం డైరెక్షన్ ప్రకారం జరుగుతోందని అనుమానాలు ఎక్కువ అయ్యాయి. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది… అయితే నిర్వాహకులకు ఇది ఏమాత్రం మంచి విషయం కాదు