బిగ్ బాస్ నాలుగో సీజన్తో తొమ్మిదవ వారం ఎలిమినేషన్ చాలా ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ కు ఒక ప్రత్యేకత ఉంది. నిర్వాహకులు కొత్తరకం స్ట్రేటజీ ని అమలు చేయబోతున్నారనే వార్తలు మధ్య పై అంచనాలు తారాస్థాయికి పెరిగాయి. ఇక వారు చెబుతున్న దాని ప్రకారం ఇంటిలో ప్రస్తుతం ఈ వారం అభిజిత్, అమ్మరాజశేఖర్, అవినాష్, హారిక, మోనాల్ గజ్జర్ ఎలిమినేషన్ లో ఉన్నారు. అయితే ఓట్ల పరంగా చూస్తే అమ్మ రాజశేఖర్ బలహీనమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు.
కాబట్టి ఎక్కువ శాతం అతని ఎలిమినేషన్ ఖాయం అని అంచనా వేస్తున్నారు కానీ ఎవరూ ఊహించని విధంగా బిగ్ బాస్ రాజశేఖర్ విషయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంటి నుండి వెళ్ళిపోయిన వ్యక్తి కి కెప్టెన్ బాధ్యతలను అప్పగించి ఇప్పటివరకు బిగ్బాస్ తెలుగు చరిత్రలో కెప్టెన్ గా ఎన్నికైన వ్యక్తి ఎలిమినేట్ కాలేదు. దీంతో అనేక రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. గత సీజన్లో ఎలిమినేషన్ విషయానికి వస్తే మొదటి సీజన్లో ముమైత్ ఖాన్ కెప్టెన్ గా కొనసాగుతున్న సమయంలో ఆమె ఎలిమినేషన్ జరిగింది.
అయితే ఆమెను బయటకు పంపకుండా సీక్రెట్ రూమ్ లో పెట్టి సభ్యుల వ్యవహారాన్ని చూపించారు. రెండు రోజుల తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చి నానా హడావుడి చేసింది. ఇటువంటి ట్విస్టులు ట్విస్ట్ బిగ్ బాస్ దగ్గర చాలా ఉన్నాయి. గత సీజన్ లో కెప్టెన్ గా కొనసాగుతున్న రాహుల్ సిప్లిగంజ్ గత సీజన్లో ఎలిమినేట్ చేసి మళ్లీ ఇంట్లోకి పంపి సభ్యులతో పాటు ప్రేక్షకులకు కూడా షాక్ ఇచ్చాడు. రాహుల్ కూడా సీక్రెట్ రూమ్ లోకి వెళ్లడం విశేషం.
అప్పుడు తిరిగి వచ్చిన రాహుల్ ఏకంగా సీజన్ టైటిల్ గెలవడం తెలిసిందే. ప్రస్తుతం అమ్మరాజశేఖర్ ఎలిమినేషన్ విషయంలో కూడా ఇలాగే బిగ్ బాస్ సీక్రెట్ రూమ్ కి పంపుతాడా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే మరొక ప్లాన్ లో భాగంగా ఎవరికి అర్థం కాని రీతిలో అభిజిత్ ను ఎలిమినేట్ చేసి ట్విస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఉన్నట్లు చెబుతున్నారు. బలమైన కంటెస్టెంట్ ను పంపించేసి సీక్రెట్ రూమ్ కు తరలించడం ద్వారా రాజశేఖర్ కూడా ఇంట్లో ఉండిపోతాడు…. టీఆర్పి మరింత పెరుగుతుంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరి కొద్ది గంటల్లో ఆగాల్సిందే….
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?