బిగ్బాస్ ఇంటిలో గ్రూప్పిజం మనం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఇంటిలో అందరూ గ్రూపులు కట్టి ఒకరిని టార్గెట్ చేయడం సర్వసాధారణం. షో చివరికి వచ్చే సమయంలో ఇటువంటి ఆటలు ఎంతో సహజంగా జరుగుతాయి. అయితే 2వ సీజన్ లో కౌశల్ గెలిచిన తర్వాత గ్రూపులు కట్టడం వంటివి ఇంటి సభ్యులు మానివేశారు. కానీ తమ సొంత ప్రయోజనాల కోసం అప్పుడప్పుడు ఇలాంటివి చేయక తప్పదు.
ప్రస్తుతం ఇంట్లో అలాంటి గ్రూపులే ఉన్నట్లు తెలుస్తోంది. మొదటగా అఖిల్, సోహెల్ ఈ మధ్యనే ఫ్రెండ్స్ కావడం గమనించవచ్చు. ఎప్పటినుండో సోహెల్, మెహబూబ్ మధ్య గట్టి బాండింగ్ ఉంది. ఇదే ఊపులో అఖిల్, సోహెల్, మెహబూబ్ కలిసి అరియానా ను టార్గెట్ చేయడం జరిగింది. అభి ది ఎవరికి హెల్ప్ చేయలేని పరిస్థితి. లాస్య, హారిక సేఫ్ గేమ్ ఆడేందుకు పరిమితమయ్యారు. దీంతో వీరి ముగ్గురిలో హవా ప్రస్తుతం ఇందులో నడుస్తూ ఉంది
అయితే బిగ్ బాస్ ఏమన్నా తెలివి తక్కువ వాడా….? ప్రేక్షకులందరూ ఎవరో ఒకరికి మొగ్గుచూపుతారు అన్న ఆలోచనతో వీరు ముగ్గురుని విడదీసేందుకు మంచి పన్నాగం పన్నాడు. అంతే వీరు ముగ్గురూ ఒక్కసారిగా విడిపోయారు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసుకునే విధంగా బిగ్ బాస్ టాస్క్ రూపొందించటంత్ఫ్ ఒక్కొక్కరి నిజస్వరూపం బయటపడింది.
అంతే అఖిల్, సోహెల్, మెహబూబ్ ఒక్కసారిగా బద్ధ శత్రువులు అయిపోయారు. వీరి మధ్య మోనాల్ వచ్చి మరికొంచెం చిచ్చుపెట్టింది. అంతే సోహెల్ అవి ఇవి విసిరేశాడు…. అఖిల్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. మెహబూబ్ చిన్నపిల్లవాడు కాబట్టి బాధతో అలాగే ఉండిపోయాడు. ఇప్పుడు ఇంట్లో ఎవరి ఆట వారు ఆడుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.