Big Boss: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నా షో త్వరలో ప్రసారం అవ్వడానికి రెడీ అయిపోతుంది. ఎంటర్టైన్మెంట్ అదేరీతిలో టెలివిజన్ ఆడియన్స్ కోసం బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఈ సారి వినూత్నంగా ఉండే రీతిలో షో నిర్వాహకులు ప్లాన్ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సారి షో లో ఎక్కువగా యాంకర్లు ఉండేలా ప్లానింగ్ చేయడం జరిగిందట. గతంలో శ్రీముఖి, లాస్య, వంటి స్టార్ యాంకర్లు రావడం జరిగింది. అయితే ఈసారి యాంకర్ రవి, వర్షిని, లోబో.. మరి కొంతమంది స్టార్ యాంకర్లు రానున్నట్లు సమాచారం.
ఇప్పటికే వీళ్ళతో చర్చలు జరిపినట్లు త్వరలో వీళ్లంతా క్వారంటైన్ కి తరలించడానికి షో నిర్వాహకులు సిద్ధమైనట్లు సమాచారం. ఇదిలా ఉంటే సీజన్ ఫైవ్ కి సంబంధించి ప్రోమో ఈనెల ఆఖరికి రిలీజ్ చేసే ఆలోచనలో షో నిర్వాహకులు రెడీ అయినట్లు సమాచారం. అంత మాత్రమే కాకుండా ఈసారి షో కి సంబంధించి ఎటువంటి వార్త ముందే సోషల్ మీడియాలో కి రాకుండా.. పర్ఫెక్ట్ టీం సెట్ చేసినట్లు సమాచారం.
Read More: Big Boss 5: బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ వీరే? రానా హోస్ట్ గా వ్యవహరించేది వీళ్ళకే
గతంలో ఎలిమినేషన్, అదే రీతిలో కొన్ని టాస్క్ లు విషయంలో… ముందే హౌస్ లో జరిగేది బయటికి వచ్చేసేవి. దీంతో షో పై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. అయితే ఈసారి అటువంటి పొరపాట్లు లేకుండా షో నిర్వాహకులు జాగ్రత్త పడినట్లు సమాచారం. అంతేకాకుండా గతంలో ఇచ్చిన టాస్క్ లు రిపీట్ చేయకుండా కొత్త గేమ్స్ ఈసారి సీజన్ ఫైవ్ లో ఇంటి సభ్యులతో షో నిర్వాహకులు ఆడించడానికి రెడీ అయినట్లు టాక్.