Big Breaking: దీపావళి సెలవు విషయంలో తలెత్తిన వివాదంలో ఓ జవాన్ ఫ్రెస్టేషన్ కు గురై సహచరులపై కాల్పులు జరపడంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దు లోని పారా మిలిటరీ బేస్ క్యాంప్ లో జరిగింది. చత్తీస్గడ్ లోని సుకుమా జిల్లా పరిధిలో గల లింగంపల్లి బేస్ క్యాంప్ లో సోమవారం వేకువ జామున కానిస్టేబుల్ (జవాన్) రితేష్ రంజన్ తన సర్వస్ తుపాకీ ఏకే 47 తో సహచర జవాన్లపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురు జవాన్ లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందే లోపే నలుగురు జవాన్లు మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు.
Big Breaking: దీపావళి సెలవు విషయంలో
మృతి చెందిన జవాన్లు రాజమణి కుమార్ యాదవ్, ధన్ జీ, ధర్మేంద్ర కుమార్, రాజవివ్ మండల్ లుగా గుర్తించారు. గాయపడిన జవాన్లులకు భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న నేపథ్యంలో వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వారిని ప్రత్యేక హెలికాఫ్టర్ లో రాయ్ పూర్ కు తరలించినట్లు రాయ్పూర్ ఐజీ ( బస్తర్ రేంజ్) సుందర్ రాజ్ తెలిపారు. కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ రితేష్ రంజన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీపావళి సెలవు విషయంలో జవాన్ల మధ్య గొడవ తలెత్తిందనీ, సెలవు ఇవ్వకపోవడంతో ఫ్రెస్టేషన్ కు గురై రితేష్ రంజన్ కాల్పులకు తెగబడ్డాడని ప్రచారం జరుగుతోంది. అయితే కాల్పులకు దారి తీసిన కారణాలపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది.