KCR : దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఊహించని విధంగా కేసులు బయటపడటంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసులు అధికంగా వస్తూ ఉండటంతో ..ఆ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఇప్పటికే లాక్ డౌన్ అమలు చేస్తూ మరో పక్క రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ ఉన్నారు.
ఇటువంటి తరుణంలో మహారాష్ట్ర పక్కనే తెలంగాణ ఉండటంతో ఇటీవల తెలంగాణలో కూడా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ..స్కూల్స్, కాలేజీలు క్లోజ్ చేయడం జరిగింది. ఇదే సమయంలో మళ్లీ లాక్డౌన్ తెలంగాణలో చేపట్టే అవకాశం ఉన్నట్లు వార్తలు ఇటీవల వైరల్ అయ్యాయి. దీంతో తాజాగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మళ్లీ లాక్ డౌన్ పై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో మరో లాక్డౌన్ విధించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.